రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శిగా రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మరిపెడ నేటిధాత్రి:

ఒంటె కొమ్ము లక్ష్మారెడ్డి గార్డెన్ లో మరిపెడ మండలం ఐదవ మహాసభ జరగగా మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణ గౌడ్ ఉన్నంత విద్యావంతుడైన మొదటి నుండి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి బాలకృష్ణ నూ గుర్తించి సిపిఐ పార్టీ మరిపెడ మండలం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బాలకృష్ణని తిరిగి 5వ మండల మహాసభలో రెండవసారి సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది
భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిపెడ మండలంలో పార్టీ సూచించిన విధంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధికి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగినది. గత కొద్ది కాలం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి.
రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ, గ్రామ స్థాయి,నాయకులు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి. చిత్రపటాన్ని పెట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వెళ్లడం జరిగినది. అక్కడ ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడానికి అనుమతించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగినది. ఇంతలో పోలీసుల జోక్యంతో ఇరు పార్టీల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నుండిజలగం ప్రవీణ్, మునిగేల్ రాజు,గజ్జల రాజు, గుండెలు శీను, భైరవేణి రాము, భాను,ఆరుట్ల మహేష్, చుక్క శేఖర్, రంజాన్ నరేష్, అభి గౌడ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి

వనపర్తిలో బిజెపి తిరంగా ర్యాలీ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్

వనపర్తి నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మారణకాండకు ప్రతీకారంగా భారత సైన్యం సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ఇస్లామిక్ టెర్రరిస్ట్ రాజ్యాలు కుట్రపూరితంగా పెహల్గాంలో 26 మందిని ఊచ కోత ఘటనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ టెర్రరిస్టులకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిని ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ద్వారా మే 7 న కేవలం 22 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్రస్తావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాదిమంది టెర్రరిస్టులను అంతమొందించి భారతదేశ రక్షణ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పారని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వారికి మద్దతుగా నిలుస్తున్న బంగ్లాదేశ్ టర్కీ సౌదీ అరేబియా దేశాల వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా రద్దుచేసి వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేలా చేశారని అన్నారు. వనపర్తి లో తిరంగా ర్యాలీలో పార్టీలకతీతంగా విద్యార్థి యువజన కుల ప్రజా సంఘాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్ద ఎత్తున పాల్గొని దేశ భద్రత విషయంలో దేశ జవాన్లకు నేను సైతం మద్దతుగా రాజకీయ పార్టీల కు అతీతంగా తిరంగా ర్యాలీలో పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నారాయణ జిల్లా రామన్ గౌడు.పట్టణ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల అరవింద్ కుమార్. రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి పురుషోత్తం రెడ్డి బిశ్రీశైలం చిత్తారి ప్రభాకర్, గౌని హేమారెడ్డి , రత్నాకర్ రెడ్డి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ చేయూత శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యనారాయణ, రామ్మూర్తి హిందూ రాష్ట్ర మహాసభ అధ్యక్షురాలు నారాయణ దాసు జ్యోతి రమణ వనపర్తి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము, కృష్ణ గౌడ్ సామాజిక నాయకులు పోచా రవీందర్ రెడ్డి, బులియన్ మర్చంట్ బంగారు అనిల్ అయ్యప్ప ఆలయ కమిటీ ముత్తు కృష్ణ గురుస్వామి స్నేక్ సొసైటీ చీర్ల కృష్ణసాగర్ మెడికల్ అసోసియేషన్ వినోద్ రామన్ గౌడ్ కుమారస్వామి ఏర్పుల సుమిత్రమ్మ, తిరంగా ర్యాలీ కో కన్వీనర్ కదిరే మధు, ఆగపోగు కుమార్ఎండి ఖలీల్, అశ్విని రాద, వారణాసి కల్పన, మని వర్ధన్, సాగర్, బోయల రాము, రాజశేఖర్, ఎద్దుల రాజు, తదితరులు పాల్గొన్నారు

బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర

సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజె కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేతలు కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు కిరాణాము వ్యాపారి ఆర్యవైశ్యుడు కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు 33 వ వార్డు ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు డిఎస్పి సైదా నాయక్ మరియు ఇన్స్పెక్టర్ శివ లింగం ఆదేశాల మేరకు నేషనల్ హైవే-65 మీద ప్రిన్స్ ధాబ ముందర వాహనాలు తనికి చేస్తుండగా ఒక బ్లూ కలర్ ఆక్టివా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు బీదర్ వైపు నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయి ని తరలిస్తుండగా పట్టుకున్నాము ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు తెలుసుకొనగా1) షైక్ సల్మాన్ తండ్రి జబ్బార్ హైదరాబాద్ 2) మహమ్మద్ మొయిజుద్దీన్ తండ్రి సమీఉద్దీన్ హైదరాబాద్ ని తెలిపినారు వీరు ఇద్దరు బీదర్ లో ఇరానీ గల్లీలో గంజాయిని తక్కువ రేట్ కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువరేట్ కు అమ్ముకొనుటకు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

 

టేకుమట్ల మండలం అంకుషాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి అల్లం ఓదెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అనంతరం అల్లం ఓదెలు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక ఒత్తిడి చేసిన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు గాను నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నన్ను ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ కు మండల నాయకులకు అంకుషాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను నిరుపేద లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని అల్లం ఓదెలు తెలిపారు

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్స్ సవరణ బిల్లు ఎక్కువ రోజులు నిలువదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహమ్మద్ రహీం ఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. వర్ఫ్ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.వర్షంలోనే అతిధులు అదరకుండా బెదరకుండా సమావేశంలో మాట్లాడడం పట్ల ప్రజలు కుర్చీలను తమ నెత్తిపై పెట్టుకుని సభలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొన్ని వర్గాలపై రోజుకోరకమైన చట్టాలు నియమాలు నిబంధనలు తీసుకువచ్చి అణగదొక్కెందుకు కృషి చేస్తుందన్నారు. రబ్బర్ బాలు గోడకు కొడితే ఆ బాలు తిరిగి అదే వేగంగా వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు.

వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఉదయం 3 గంటల వరకు పార్లమెంటులో ఉండి ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.త్వరలోనే కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తుంది ఈ విధమైన బిల్లులన్నీ చెల్లకుండా పోతాయన్నారు. లౌకికత్వాన్ని పూర్తిస్థాయిలో పాటించేది అన్ని వర్గాలకు సమాన ప్రతిపాదికన గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముయ్యద్దీన్,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు తైవుల్లా, లతోపాటు మాజీ టి ఎస్ ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ అత్తర్ అహ్మద్,అశోక్ అప్పారావు, తాసిల్దార్ దశరథ్, మత పెద్దలు పుర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షంలోనే కొనసాగిన సదస్సు

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేక నిరసన సదస్సు వర్షంలోనే కొనసాగింది. వక్తలు వర్షంలో తడుచుకుంటూ ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణ బిల్లు కంటే ఈ వర్షం కఠినమైంది కాదని ఇలాంటి వర్షాలను తాము ఇలాంటి ఎన్నో కష్టాలు సహిస్తామని వక్తలు ప్రకటించారు.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ..

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్

◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆ -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్ రెడ్డి

◆ జహీరాబాద్ మాజీ మంత్రివర్యులు డా౹౹ఎ. చంద్రశేఖర్..*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ అమోదించిన “వక్స్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా విద్యుత్-దీపాల కమాన్ కూలిపోవడంతో కింద కూర్చున్న 8 మందిపై పడి గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వారికి హైదరాబాద్ తరలించారు.విద్యుత్ సరఫరా అవడంతో వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.గాయపడి చికిత్స పొందుతున్న వారిని స్థానిక సన్ రోహి ఆసుపత్రిలో ఆదివారం మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ డా౹౹ఎ. చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పరామర్శించారు.వారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,అక్తర్,హర్షద్ పటేల్,అక్బర్, జుబేర్,జహంగీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు.!

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మీ గార్డెన్ లో ప్రవళిక – శివ కుమార్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున మండల అగ్రికల్చర్ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులు పంట సీజన్ కాలం ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలను సంబంధిత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట పద్ధతులు పాటించాలని, మండల కేంద్రంలోని కొన్ని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారు నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రైతుల ముఖ్యంగా విత్తనాలను మరియు పురుగుల మందులు కొనేటప్పుడు షాపు యొక్క బిల్లును తప్పకుండా తీసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్డు కోసం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు తమ ఆధార్ కార్డు ను పట్టా పాస్ బుక్కులు తీసుకొని సంబంధిత ఫోన్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను

కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారుల ఇళ్లపై ఏసీబీ విచారణ చేపట్టాలి

సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

చర్ల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండలంలోని దండుపేట ప్రధాన రహదారి నుండి కొత్తపల్లి లింగాపురం గొంపల్లి మొగలపల్లి సి కత్తి గూడెం మరియు కత్తిగూడెం మీదుగా వేసిన గ్రామీణ సడక్ యోజన నిధులు సుమారు 54 కోట్ల రూపాయల నుంచి 58 కోట్ల వరకు సగం రోడ్లు వేసి పూర్తిగా కాకుండానే అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా స్వాహా చేశారు సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం లేదు కేంద్రం నిధులు అంటే అంతా చులకన అని సీనియర్ జర్నలిస్టు నరసింహా అన్నారు ప్రధాన రహదారి నుండి గోదావరి పరివాహక గ్రామపంచాయతీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుట కొరకు కేంద్రం ఎంతో దూర దృష్టితో ఆ నిధులను సమీకరిస్తే సదరు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వలన రహదారి పూర్తికాలేదు గోదావరి వరదలు సమీపిస్తున్నందున ఇకనైనా జిల్లా విజిలెన్స్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యుల దగ్గర నుండి నగదును రికవరీ చేపించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలి చర్ల మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రహదారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్

నేటి ధాత్రి చర్ల

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

ప్రేమ పేరుతో మోసం….

ప్రేమ పేరుతో మోసం….మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

పెళ్లిచేసుకుంటానని కులం నెపంతో మోసం చేసిన ప్రేమికుడు..

మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దళిత యువతి.

పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు..

వరంగల్/నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

 

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, కులాలు వేరైనా ఒకే గ్రామస్థులం అంటూ ప్రేమ పేరుతో నమ్మించి ఒక నర్సింగ్ దళిత యువతిని మోసం చేశాడు ఒక కారు డ్రైవర్ కాగా..

ఆ ప్రేమికుడి మాయమాటలకు మోసపోయి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దుగ్గొండి మండలంలోని ముద్దునూరు గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకున్నది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన బండి లక్ష్మి , నర్సయ్య పెద్ద కుమారుడు బండి నాగరాజు సికింద్రాబాద్ లో కార్ డ్రైవింగ్ పని చేస్తూ బ్యాచిలర్ గా అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

అదే గ్రామానికి చెందిన కన్నం పూలమ్మ ముత్తయ్య పెద్ద కూతురు కన్నం అరుణ సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ చేస్తుంది.

గత సంవత్సరం నర క్రితం కారు డ్రైవర్ నాగరాజు యువతి
కన్నం అరుణతో మనం ఇద్దరం ఒకే గ్రామానికి చెందిన వారిగా పరిచయం చేసుకున్నాడు.

ఒక సంవత్సరం పాటు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు.

కులాలు వేరైనప్పటికీ ఒకే గ్రామానికి చెందినవారిమి కనుక పెళ్లి చేసుకుందామని నమ్మ పలికాడు.

నర్సింగ్ చేస్తున్న అరుణతో ప్రేమ వివాహం పెంచుతూ ఆమె వద్ద నుండి ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 50 వేలకు పైగా తీసుకున్నాడు.

అనేకసార్లుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో యువతిని తీసుకెళ్లి శికార్లకు కొట్టాడు.

వారు దిగిన ఫోటోలు గ్రామంలో వైరల్ కావడంతో ముఖం చాటేసి తక్కువ కులానికి చెందిన దళిత యువతిగా నిరాకరిస్తూ మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు ఆ కిలాడి యువకుడు నాగరాజు.

మనస్థాపానికి గురి చెందిన దళిత నర్సింగ్ యువతి కన్నం అరుణ ఇంట్లో ఎవరు లేని సమయంలో కెమికల్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాగా అంతకుముందే పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా మరొక యువతితో పెళ్లి చేసుకోవడంతో నాగరాజుపై పలువురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు నర్సంపేట ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు కన్నం పూలమ్మ ముత్తయ్యలు మాట్లాడుతూ మా ముద్దునూరు గ్రామానికి చెందిన బండి నాగరాజు అనే కార్ డ్రైవర్ హైదరాబాదులో ఉంటూ తమ కూతురు అరుణకు మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతీతో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.

వారి ప్రేమ వివాహారంపై నాగరాజు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలను కొందరు పెద్దమనుషుల సమక్షంలో నిలదీయగా ప్రేమించిన విషయం వాస్తవమే మా కుమారుడిని పిలిపించి మాట్లాడతామని నమ్మ పలికి మరొక యువతతో వారి కొడుకుకు వివాహం చేశారని తెలియజేశారు.

హైదరాబాదులో ఉన్నప్పుడు ప్రేమ పేరుతో తన కూతురు వద్ద ఉన్న రూపాయలు 50 వేలకు పైబడి తీసుకొని పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తూ ఫలుదపాలుగా విచక్షణ రహితంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మనస్థాపానికి గురైన తమ కూతురు అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలు ఆరోపించారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన నాగరాజుపై నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి కులం పేరుతో దూషిస్తూ తన కూతుర్ని మానసికంగా వేధించి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు పోలీసుల వేడుకున్నారు.

దుగ్గొండి ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు వివరణ కోరగా నర్సంపేట ఏసిపి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని తెలిపారు.

దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో బాదితుల ఫిర్యాదు చేయలేదని ఎస్సై తెలిపారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

చిట్యాల, నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చిట్యాలమండల లోని గుంటూరు పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ముద్దేన నాగరాజు*ఉపాధ్యక్షులుగా*:మన్యం పెద్ద తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా*:-కంకణాల రామ్, కోటేశ్వరరావు ,సహాయ కార్యదర్శిగా*:- మునిమాకుల నాగేశ్వరరావు, కోశాధికారిగా:కోటపాటి సాంబశివరావు ,*కార్యవర్గ సభ్యులు*పాశం శంకర్ ,కంకణాల లక్ష్మీనారాయణ ,పంచమర్తి కృష్ణారావు మన్నెంచిన్న తిరుపతయ్య, గోదే సుబ్బారావు ,కోటపాటి శ్రీనివాస్, కొంక వెంకటప్పయ్య, మన్యం శ్రీనివాసరావు దుగ్గినేని హరిబాబు..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

నేటిధాత్రి భూపాలపల్లి:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని, 30 వార్డుల్లో కాంగ్రెస్ నేతలు గెలుపొందించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని మొత్తం 30 వార్డుల ముఖ్య నేతలతో ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజితో కలిసి కేకు కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న గొప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు సుంకర రామచంద్రయ్య ఇప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ గురుముల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version