
మత్తు వద్దు భవితే ముద్దు.
మత్తు వద్దు భవితే ముద్దు జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ సేవ్ టు లైఫ్ మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ మత్తుకోసం నిండు జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.