జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(బి ఎస్ యు)

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి:

shine junior college

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్యఅందించాలి నేడు ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బి ఎస్ యు) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వా లు మారిన పత్రికా విలేకరు లకు ఇచ్చిన హామీలు ఏ ప్రభు త్వం నెరవేర్చ లేకపోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లల కు ఉచిత విద్య అందించలే కపోవడం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

మండల అధ్యక్షులుగా గుమ్మడి సత్యనారాయణ ఎన్నిక.

మండల అధ్యక్షులుగా గుమ్మడి సత్యనారాయణ ఎన్నిక.

చిట్యాల నేటి ధాత్రి:

shine junior college

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది
అధ్యక్షులు గా గుమ్మడి సత్యనారాయణ
ఉపాధ్యక్షులు:గా సర్వ రాజు
ప్రధాన కార్యదర్శి గా పువ్వటి హరికృష్ణ
సహాయ కార్యదర్శి గా కైరిక కిషన్ రావు కోశాధికారి గా జిన్నె వేణు
కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్ గంజి రవీందర్ జోగు భాను చందర్ మారెళ్ల దేవేందర్ రెడ్డి,గుండెబోయిన మహేందర్ లను డీలర్ అందరమూ సమావేశమై ఏకగ్రీవంగా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

 

 

 

 

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

 

 

 

 

 

మొన్నటి దాకా సందడి చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్ సడెన్ గా సైలెంట్ అయిపోయారు. హంగామా వద్దు – కష్టించడమే ముద్దు అనుకుంటున్నారు. మరి వీరిలో కష్టానికి ప్రతిఫలం దక్కించుకునే హీరోలెవరో చూద్దాం.

 

 

 

 

 

 

వెలుగు – చీకటి, కష్టం – సుఖం, మంచి – చెడు – ఎంత వ్యతిరేకమైనా పక్కపక్కనే ఉంటాయి. అదే తీరున నిశ్శబ్దం వెనకాలే శబ్దం కూడా చోటు చేసుకొని ఉంటుంది. ప్రస్తుతం ఓ గ్రాండ్ సక్సెస్ కోసం తపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ (Tollywood Young Heros) అందరూ సైలెంట్ గానే కనిపిస్తున్నారు. తమ చిత్రాలతోనే సౌండ్ చేయాలని వీరు నిర్ణయించినట్టు అనిపిస్తోంది. అలాంటి వారిలో విశ్వక్ సేన్ (Vishwaksen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), వరుణ్ తేజ్ (Varun Tej), సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఉన్నారు.

 

 

 

 

 

 

 

వీరందరూ ‘హంగామా వద్దు – కష్టపడడమే ముద్దు’ అనే సూత్రాన్ని నమ్మి సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మధ్య వరుస సినిమాలతో హంగామా చేసిన విశ్వక్ సేన్ తన తాజా చిత్రం ‘ఫంకీ’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ సారి సినిమా పూర్తయ్యాకే ‘ఫంకీ’ ప్రమోషన్స్ లో కనిపించాలని విశ్వక్ సేన్, ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ భావిస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సైతం కామ్ గానే సాగుతున్నారు. ఆయన నటిస్తోన్న మూవీ ‘ఇండో కొరియన్ హారర్ కామెడీ’తో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని వరుణ్, గాంధీ భావిస్తున్నారు. ‘జటాధర’ సినిమాలో నటిస్తోన్న సుధీర్ బాబు సైతం ప్రస్తుతం సైలెన్స్ నే ఆశ్రయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రచార పర్వం ప్రారంభమయ్యాకే సుధీర్ నోరు విప్పే ఛాన్స్ కనిపిస్తోంది.

 

 

 

 

 

 

ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ‘క’తో కనికట్టు చేసిన ఈయన ‘దిల్ రూబా’ పరాజయంతో కామ్ అయిపోయారు. ఇటీవల ‘కే ర్యాంప్’ సినిమా పూర్తి చేసిన కిరణ్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల పైనే అబ్బవరం ఫుల్ హోప్ పెట్టుకున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎలాంటి అప్డేట్స్ లేకుండా చిత్రీకరణ సాగుతోంది. ఇక అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ పరాజయంతో కుదేలయ్యారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’లో నటిస్తున్న సిద్ధూ ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకూ భలేగా సందడి చేసిన ఈ యంగ్ హీరోస్ అందరూ ఒకేసారి హంగామా వద్దు అనుకోవడం విశేషమే. మరి ఈ యువ కథానాయకుల్లో ఎవరెవరు ఏ సినిమాతో హిట్ కొడతారో చూద్దాం.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌ .

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌

 

shine junior college

 

 

 

 

 

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

 

 

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.

 

 

‘నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్‌. అలానే ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)’ వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.

 

 

హవీష్‌ మూవీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత నిఖిల కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు..

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు.. 

shine junior college

 

 

 

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు.

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆర్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటూ  ఉంటాడు. గతంలో ఒక  మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ  పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనకు సంబంధించిన  వ్యాపార సంస్థలతో పాటు నివాసంలో కూడా ఐటీ దాడులను నిర్వహించారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులను నిర్వహిస్తున్నారు. 

 

 

 

చెన్నైలోని అన్నా నగర్, కొట్టివాకం వేలచెరి, కిల్పాక్ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.  ఈ రెస్టారెంట్ చైన్ కు ఆర్యకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ రెస్టారెంట్స్ అన్నింటిని.. వ్యాపారవేత్త అయినా కున్హి మూసాకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఇక కున్హి మూసా పై ఐటీ అధికారులు నిఘా పెట్టడంతో అది ఆర్య వరకు తీసుకొచ్చిందని సమాచారం. అందుకే ఆయన ఆఫీస్, ఇంట్లో కూడా అధికారులు  దాడులను నిర్వహించారు. ఇంకోపక్క ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని, అంతేకాకుండా పన్ను కట్టకుండా  తిరుగుతున్నాడని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడుల గురించి ఆర్య మాట్లాడుతూ.. ” ఆ రెస్టారెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంట్ యజమాని నేను కాదు.. అతను వేరే వ్యక్తి.” అంటూ చెప్పుకొచ్చాడు. 

 

ఇక ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి సినిమాతో ఆర్య తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్  అవుతూ వస్తుంది.  ఇక ఆర్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన చివరగా నిర్మించిన సినిమా ఎనిమీ. విశాల్, ఆర్య నటించిన ఈ సినిమా తమిళ్ లో విజయాన్ని అందుకుంది కానీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

 

ఇక ఆర్య.. హీరోయిన్ సయేషా సైగల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేషా తెలుగులో అక్కినేని అఖిల్ డెబ్యూ చిత్రంగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక అఖిల్ తరువాత సయేషా తెలుగులో కనిపించలేదు.  ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సయేషా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు.

సీసీ కెమెరాల ఏర్పాట్లతో తలెత్తని సమస్యలు…

నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి

చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సీఐ బహిరంగ సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

shine junior college

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ఎలాంటి సమస్యలు తలెత్తవని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతి రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో టౌన్ సిఐ రఘుపతిరెడ్డి ఆ గ్రామ పంచాయితీ పరిది ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించారు. సిఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నాటు సారాయి తయారీ, అమ్మకాల పట్ల అడిగి తెలుసుకోగా గ్రామపంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ అమ్మకం ఏరులై పారుతున్నదని సిఐకి గ్రామస్తులు తెలుపగా అవాక్కయ్యారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారని ప్రజల ఆరోపించారు. గుడుంబా అమ్మకాలు తయారీ పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా ఫిర్యాదు చేస్తే వెంకటేష్ స్పందించి చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.యువత మత్తుపదార్థాలకులోనై బంగారు భవిష్యత్తును పడుచేసుకోవద్దన్నారు. పిల్లలు,విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు తో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు.గ్రామ ప్రజలందరి సహకారంతో మరో రెండువారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి తెలియజేశారు.ముందుగా గ్రామస్తులు వనభోజనాలకు వెళ్తున్న తరుణంలో సీఐ గ్రామానికి చేరుకోగా మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజంఆలీ,గ్రామస్తులు పెద్ది తిరుపతి రెడ్డి, బాషబోయిన శ్రీను, వరంగంటి ప్రవీణ్ రెడ్డి,ఉప్పుల రాజు,మాటేటి రాంబాబు, వంగ పురుషోత్తం, కోమాల్ రెడ్డి, చేరాలు,మల్లయ్య,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

 

shine junior college

 

 

 

 

 

నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. అయితే విజయాలు మాత్రం ఆమెను చూసి ముఖం చాటేస్తున్నాయి. ఆమె వరుసగా ఆరు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 

 

 

 

 

త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తోంది. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ను అందిపుచ్చుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ’96’ సినిమాలో కొత్త త్రిషను చూశారు సినీ జనం. ఆమె అభిమానులు సైతం త్రిషలోని ఆ క్యూట్ యాంగిల్ ను చూసి అవాక్కయ్యారు. మళ్ళీ మరోసారి ఆమెను ఆరాధ్యదేవతగా కొలవడం మొదలు పెట్టారు. అలా త్రిష తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ కెరీర్ ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు పెద్దంతగా కనబడటం లేదు.

 

 

 

 

 

 

 

 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలలోనూ త్రిష కీలక పాత్రలను పోషించింది. ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత దూళిపాళ్ల తదితరులు ఇందులో నటించినా… వీరందరి కంటే త్రిష పాత్రకే అత్యధిక ప్రాధాన్యం ఆ రెండు భాగాల్లోనూ ఉంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించకపోయినా… ఫర్వాలేదనిపించింది. అయితే… ఆ తర్వాత వరుసగా త్రిష పరాజయాలనే చవిచూస్తూ వచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్ -2’ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘ది రోడ్’ పరాజయం పాలైంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కిన ఈ సినిమా త్రిషకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన దళపతి విజయ్ ‘లియో’ సైతం త్రిషను నిరాశ పర్చింది. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా… అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 

 

 

 

 

 

 

 

విజయ్ మరో సినిమా ‘గోట్’లో త్రిష అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫర్వాలేదనిపించింది కానీ ఆ విజయాన్ని త్రిష ఖాతాలో వేయలేదు. ఇక ఆ తర్వాత మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’లో త్రిష కీలక పాత్రను పోషించింది. ఇది కూడా ఎబౌ ఏవరేజ్ మూవీగానే ఉండిపోయింది. దీని తర్వాత అజిత్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో త్రిష నటించింది. అందులో మొదటిది ‘విడుముయార్చి’ కాగా రెండోది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో ఈ యేడాది వచ్చిన మూడు సినిమాలూ త్రిషకు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నే ఇచ్చాయని చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

 

 

ఈ యేడాది త్రిష నటించిన నాలుగో చిత్రంగా ఇటీవలే ‘థగ్ లైఫ్’ వచ్చింది. కమల్ హాసన్ తోనూ, శింబుతోనూ గతంలో త్రిష సినిమాలు చేసింది. అలానే మణిరత్నం తోనూ ‘పొన్నియన్ సెల్వన్’ చేసింది. అయితే ఈ అందరూ మళ్లీ కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతో త్రిష ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అయ్యింది. ఈ యేడాది ఆమెకు ఇది వరుసగా నాలుగో పరాజయం.

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం త్రిష… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో చేస్తోంది. గతంలో ‘స్టాలిన్’లో కలిసి నటించిన త్రిష చాలా కాలం తర్వాత ఈ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమైపోయింది. ఎప్పుడు విడుదల అయ్యేది ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. మరి ‘విశ్వంభర’ తో త్రిష తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే.

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే
ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం*

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్ ,మాజి ఎంపీటీసీ సంతు పటేల్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు:
బాగారెడ్డి పల్లి కి చెందిన మొగుల్లయ గారికి ₹.15,000/-, కుప్పనగర్ కి చెందిన సంధ్య రాణి గారికి ₹.40,500/-,& సతీష్ గారికి ₹.15,000/-,
ఝరసంఘం కి చెందిన నాగరాణి గారికి ₹.25,500/- జోనగామ కి చెందిన సంగాన్న గారికి *₹.15,000/- తుమ్మన్ పల్లి కి చెందిన ఫకీర్ బాబు గారికి ₹.43,500/- బర్దిపూర్ కి చెందిన నర్సింలు గారికి ₹.600,000/-, సిద్దాపూర్ కి చెందిన స్వరూప గారికి ₹.45,000/- ఈదులపల్లి కి చెందిన మంజుల గారికి ₹.19,500/-..ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య.

వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య

వనపర్తి నెటిదాత్రి:

shine junior collegeవనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య నియామకం అయ్యారు .వనపర్తి వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు .ప్రధాన కార్యదర్శిగా డి బాలరాజ్ కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్య కార్యదర్శిగా గంధం రాజు కోమరి పుల్లూరి విశ్వనాధం దస్తగిరి ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య నియామకం అయ్యారు ఈ సందర్భంగా పార్లమెంట్ నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షున్ని కమిటీ సభ్యులను అభినందించారు వారికి దిశా నిర్దేశం చేస్తూ వనపర్తి పట్టణంలో అన్ని వార్డులు పర్యటించి వార్డులో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులకు తెలపాలని ప్రజల సమస్యలు పరిష్కరించుటకు కృషి చేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని గైర్హాజరు కాకుండా కమిటీ నాయకులు పాల్గొన్నారు సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల కొరకు పనిచేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలకు మూడు నెలలు రాకుంటే వారి వారి పదవిని తొలగిస్తామని రాములు తెలిపారు తెలుగుదేశం పార్టీ ని దివంగత ఎన్టీ రామారావు స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని ఓటు బ్యాంకు కూడా ఉన్నదని స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను ఉంచుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హోటల్ బలరాం ఫారుక్ ఎండి దస్తగిరి శంకర్ ఆవుల శ్రీను అప్పయపల్లి బాలయ్య చిట్యాల బాలరాజు ఉపేంద్ర బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

shine junior college

 

 

 

 

 

 

బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది

 

 

 

బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జూన్ 18న) ఉదయం 6.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 00, 360కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91, 990కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర తగ్గింది.

 

 

 

 

 

 

 

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 00, 510కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 92, 140కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 00, 360కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91, 990కి చేరింది. వెండి ధరలు కేజీకి రూ100 మేర పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • విజయవాడలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • ఢిల్లీలో రూ. 1, 00, 510, రూ. 92, 140
  • ముంబైలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • వడోదరలో రూ. 1, 00, 410, రూ. 92, 040
  • కోల్‌కతాలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • చెన్నైలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • బెంగళూరులో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • కేరళలో రూ. 1, 00, 360, రూ. 91, 990
  • పుణెలో రూ. 1, 00, 360, రూ. 91, 990

 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 20, 100
  • విజయవాడలో రూ. 1, 20, 100
  • ఢిల్లీలో రూ. 1, 10, 100
  • చెన్నైలో రూ. 1, 20, 100
  • కోల్‌కతాలో రూ. 1, 20, 100
  • కేరళలో రూ. 1, 20, 100
  • ముంబైలో 1, 10, 100
  • బెంగళూరులో రూ.1, 10, 100
  • వడోదరలో రూ. 1, 10, 100
  • అహ్మదాబాద్‌లో రూ. 1, 10, 100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

 

 

గూగుల్ సేఫ్టీ సెంటర్..ప్రారంభించిన సీఎం రేవంత్

ఆసియాలో తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్..ప్రారంభించిన సీఎం రేవంత్

shine junior college

 

 

 

 

 

 

చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గూగుల్‌లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు.

 

 

 

 

 

 

 

హైదరాబాద్, జూన్ 18: గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే అని తెలిపారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని.. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయన్నారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్‌గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాము’ అని చెప్పుకొచ్చారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు.

 

 

 

 

 

 

ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. గూగుల్‌లా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడికి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందన్నారు. సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుందని సీఎం అన్నారు. దీనిని తెలంగాణ రైజింగ్ అని పిలుస్తామని… 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

గూగుల్ ఆఫీస్ పక్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని.. రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గూగుల్ మద్దతు కావాలని.. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నామన్నారు. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ట్రాన్స్‌జెండర్లకు చేయూత

విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. గూగుల్ ఒక వినూత్న సంస్థ, తమది ఒక వినూత్న ప్రభుత్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేశాయన్నారు. జీహెచ్‌ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకుంటోందన్నారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని.. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అందరికీ ఆరోగ్యమే లక్ష్యం

తెలంగాణలో ప్రతీ సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్‌ల నుంచి వస్తున్నారని… చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ ఆరోగ్యం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవే తన ప్రధాన ఆవిష్కరణలన్నారు. ‘గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్‌లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు

⏩ అర్హులకు అందని సంక్షేమ పథకాలు.
⏩ పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు.

సుంకరి మనిషా శివకుమార్. 16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి:

shine junior college

గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయి అని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని,గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరు అయి ప్రొసీడింగ్స్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో ఇంటి నిర్మాణ పిల్లర్లు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయురాలు అయింది అని ఆవేతరం వ్యక్తం చేశారు. పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు అందిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలసి పోరాడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంజీవ,గ్రామ పార్టీ నాయకులు బొజ్జం తిరుపతి,నరసింహ,SbK అంజాద్,బొంత.రవి,ఏడాకుల మోహన్ రెడ్డి,రాజారాం,కన్నేబోయిన.రాజు,మెండురామకృష్ణ,రాజేందర్,మురళి,యశోద,అశోక్,చిరు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

రోహిత్ శర్మ రికార్డ్ సమం..

రోహిత్ శర్మ రికార్డ్ సమం.. అద్భుత సెంచరీ సాధించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

 

shine junior college

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి.

 

 

 

 

 

 

 

చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బ్యాట్‌తో రాణించాడు. తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తాయి. అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఆడుతున్న మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో అలరించాడు (Glenn Maxwell Century). ఈ క్రమంలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

 

 

 

 

 

 

 

 

 

మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌-2025లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కెప్టెన్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 48 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాక్సీ తన ఇన్నింగ్స్‌లో 13 భారీ సిక్సర్లతో పాటు 2 ఫోర్లు కూడా కొట్టాడు. మొత్తానికి 49 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఇది మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్.. రోహిత్ శర్మ, జోస్ బట్లర్ సరసన చేరాడు.

 

 

 

 

 

 

 

రోహిత్, బట్లర్, ఫించ్, వార్నర్ కూడా ఎనిమిదేసి టీ-20 సెంచరీలు సాధించారు. అలాగే టీ-20ల్లో 10, 500 పరుగులు, 170 కంటే ఎక్కువ వికెట్లు, 5 కంటే ఎక్కువ సెంచరీల చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డును మ్యాక్స్‌వెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ తర్వాత పాకిస్తాన్ బాబర్ ఆజామ్ (11) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రౌలీ రూసో, విరాట్ కోహ్లీ తొమ్మిదేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

మళ్లీ అగ్రపీఠంపై మంధాన

shine junior college

 

ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం…
దుబాయ్‌: ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో స్మృతి 727 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీ్‌సలో 52 సగటుతో 264 పరుగులు సాధించడంతో ఆమె ర్యాంక్‌ మెరుగుపడింది. బ్రంట్‌ (ఇంగ్లండ్‌), లారా వోల్వార్ట్‌ (దక్షిణాఫ్రికా) 2, 3 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఎకెల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా), మేగాన్‌ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్‌) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్..

 

shine junior college

 

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.

 

 

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు సార్లు అందిస్తోంది (PM-KISAN 20th instalment).

 

 

ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు జమ అవుతాయని సమాచారం.

 

 

 

 

 

మరి, ఈ 20వ విడత పీఎం-కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండడం. రెండోది బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండడం. ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం-కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా ఈ రెండు పనులను పూర్తి చేసుకోవాలని రైతులకు అధికారులకు సూచిస్తున్నారు.

124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..

124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..

shine junior college

 

 

 

 

 

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతోన్నాయి. ఇప్పటి వరకు 124 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.

 

 

 

 

 

 

అహ్మదాబాద్, జూన్ 18: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షల నిర్వహణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 163 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 124 మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికొన్ని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి.

 

 

 

 

 

 

అవి గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మృతదేహానికి ఈ పరీక్ష నిర్వహించేందుకు దాదాపు 75 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ చాలా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. డీఎన్‌ఏ గుర్తించే క్రమంలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరాయంగా తమ పనిని కొనసాగిస్తున్నాయి.

 

 

 

 

ఇక ఈ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాంతోపాటు ఈ విమానం కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని సైతం వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలను అంత్యక్రియలు సైతం పూర్తయ్యాయి.

 

 

 

 

 

 

 

మరోవైపు ఈ ప్రమాద ఘటన అనంతరం గాయపడిన 71 మంది ఆసుపత్రిలో చికిత్స పొందారని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి వెల్లడించారు. వారిలో ఇద్దరు మరణించారని.. మిగిలిన తొమ్మిది మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వివరించారు.

 

 

 

 

 

 

 

జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు టేకాఫ్ అయింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు మేఘానీనగర్‌లో కుప్పకూలి దగ్ధమైంది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికుల్లో ఒక్కరు మినహా అందరూ మరణించారు. అలాగే ఈ విమానంలో 12 మంది సిబ్బంది సైతం మృతి చెందారు. ఈ విమానం బీజే హాస్టల్‌పై పడడంతో.. ఆ సమయంలో భోజనం చేస్తున్న 29 మంది మెడికోలు సైతం మరణించారు. పలువురు మెడికోలు సైతం ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

గోల్కొండ బోనాలు వైభవంగా నిర్వహిస్తాం..

shine junior college

 

 

 

 

ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

 

 

హైదరాబాద్: ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్‌ ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad In-charge Minister Ponnam Prabhakar) తెలిపారు. మంగళవారం గోల్కొండ పోర్టులో జరిగిన కార్యక్రమంలో బోనాలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి తొలి బోనాల పండగ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

 

ఈ ఉత్సవాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల అమ్మవార్లకు ప్రభుత్వం తరుఫున పట్టు వస్ర్తాలను సమర్పిస్తామని మంత్రి తెలిపారు. నెలరోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

 

 

 

వారికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ హరిచందన, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, గోల్కొండ బోనాల ఆలయ కమిటీ ఛైర్మన్‌ చంటిబాబు, ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, సౌత్‌వె్‌స్టజోన్‌ డీసీపీ చంద్రమోహన్‌, తహసీల్దార్లు జ్యోతి, అహల్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version