ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2 ఈటెల సారే కొండంత అండ..? ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే…

Read More

అభివృద్ధి పథంలో నడిపిద్ధాం – – పిఆర్‌ మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై హన్మకొండ అంబేడ్కర్‌భవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ జిల్లా ప్రతి అంశంలో అభివద్ధి కావాలని అన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు…

Read More

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…? తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన…

Read More

డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి – నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలోని 26వ డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్‌, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్‌ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్‌ ఎన్‌.రవికిరణ్‌, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్‌ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి బట్టల బజార్‌, పాపయ్యపేట్‌ చమన్‌, కాకతీయ టాకీస్‌ వరకు పర్యటించారు….

Read More

సీఎం సార్‌…జరదేఖో..!

సీఎం సార్‌…జరదేఖో..! ఆఖరి మజిలీకి…అంతులేని కష్టం ”మనిషి జీవితం అనేక మలుపులతో కొనసాగుతుంది. కష్ట సుఖాల మధ్య సాగే మనిషి జీవితంలో ఆఖరి మజిలీ కూడా అంతులేని కష్టంగా మారింది. చివరి అంకమైన మనిషి మరణం వారి కుటుంబాలకు బొందల గడ్డ రూపంలో మరింత ఇబ్బందులను తెలిచ్చిపెడుతుంది. మరణించిన తమ కుటుంబ సభ్యున్ని ఖననం చేయటానికి కూడా  స్మశానవాటికలు సరిగా లేకపోవటం, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవటం పలు గ్రామాలలో తీరని సమస్యగా మారింది”. వరంగల్‌…

Read More

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…! ”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా…

Read More

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….? భూకబ్జాలో దర్జా వెలగబెడదామనుకుంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందట. అధికార పార్టీ కార్పొరేటర్‌లం మాకు ఎవరు అడ్డు కల్లకు పొరలు కమ్మి కార్పొరేషన్‌ సిబ్బందిని, మహిళా అధికారిని నానా దూర్బాషలాడి కబ్జాను సమర్థించే పనిచేసి, ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ఆయన ప్రమేయం లేకున్నా పేరును వాడుకుని కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు త్వరలోనే చెక్‌ పెట్టబోతున్నట్లు తెలిసింది. భూవివాదం కోర్టులో…

Read More

అధికారుల వాహన ‘మాయ’

అధికారుల వాహన ‘మాయ’ – అధికారిక వాహనాలలో వారిదే ఇష్టారాజ్యం – బిల్లు చెల్లించేది ఓ వాహనానికి, తిరిగేది మరో వాహనం – బినామీ పేరుతో వేలు దండుకుంటున్న ఓ జిల్లాస్థాయి అధికారి – తిరిగేది సొంతకారులో…వాహన బిల్లు బినామీ ఖాతాలోకి… – మహబూబాబాద్‌ జిల్లాలో ఆ అధికారి రూటే సపరేటు అధికారిక వాహనాల విషయంలో అధికారులు మాయ చేస్తున్నారు. అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనతో తమ అతితెలివికి పదునుపెట్టి బినామీ పేర్లతో పని కనిస్తున్నారు. అధికారులు వాడే…

Read More

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక…

Read More

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు…

Read More

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల…

Read More

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌

ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించిన కేటీఆర్‌ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టీ.రామారావు అభినందించారు. బుధవారం వరంగల్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విజయం, పరిషత్‌ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన సందర్బంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని కేటీఆర్‌ అభినందించారు. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందుకు కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరించి…

Read More

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు : జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు

పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నామని వరంగల్‌ నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. మంగళవారం వరంగల్‌ ఆర్బన్‌ జిల్లాకు సంబంధించి మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ధర్మసాగర్‌లోని వియంఅర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షించారు….

Read More

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా..

నర్సంపేట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా.. నర్సంపేట డివిజన్‌లోని ఆరుమండలాల్లో 50ఎంపిటిసి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. టిఆర్‌ఎస్‌ పార్టీ దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపిపి స్థానాల మెజారిటీని కైవసం చేసుకోగా, నర్సంపేట మండలంలో ఎంపీపీ స్థానానికి మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటుతూ పరువు నిలబెట్టుకుంది. డివిజన్‌వ్యాప్తంగా 70స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీ 50స్థానాలలో అత్యధికంగా గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 19స్థానాలను గెలుచుకుంది. డివిజన్‌వ్యాప్తంగా…

Read More

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కారుదే పైచేయి వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఎంపిటిసి ఫలితాలు నర్సంపేట మండలంలో… 1) రాజుపేట – కాంగ్రెస్‌ 2) ముత్తోజిపేట – కాంగ్రెస్‌ 3) చంద్రయ్యపల్లి – టీఆర్‌ఎస్‌ 4) లక్నేపల్లి – కాంగ్రెస్‌ 5) బాంజీపేట – కాంగ్రెస్‌ 6) ముగ్దుంపురం – కాంగ్రెస్‌ 7) మహేశ్వరం – టీఆర్‌ఎస్‌ 8) మాధన్నపేట – కాంగ్రెస్‌ 9) కమ్మపెల్లి – టీఆర్‌ఎస్‌ 10) గురిజాల – టీఆర్‌ఎస్‌ 11) ఇటుకాలపల్లి…

Read More

అరూరికి మంత్రి పదవి ఇవ్వాలి…

ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి కేటాయించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు కోరారు. గురువారం వర్థన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టివిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల అపద్భాంధువు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమంకోసం నిరంతరం కషి చేస్తు, నియోజకవర్గంలో నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తన సమస్యలుగా భావించే వారిని,…

Read More

దయన్న సొమ్మెక్కడిదన్న- పీఎలకు లక్షల్లో ఖర్చు…?

ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంలో అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చొరవతో మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన నాటి నుంచి ఎర్రబెల్లి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో తానొక్కడినే మంత్రిని అని టిఆర్‌ఎస్‌ సీనియర్లు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నాడని అంతర్గతంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఎర్రబెల్లి తన బిల్డప్‌ను పెంచుకుని కాస్ట్లీ మంత్రి అనిపించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నాడట. ఈ బిల్డప్‌లో భాగంగా ఎంతగా…

Read More

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా…

Read More

‘ఈటెల’కు పీఎల తలనొప్పి…? ఈటెలను వదలనంటున్న పీఎలు?

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా కొనసాగిన వారు ఉద్యోగం ఖాళీగా లేదు. ప్రస్తుతం తనకు పీఎల అవసరం ఎంతమాత్రం లేదన్న వినడం లేదట. వద్దుమొర్రో అని చెప్పిన మంత్రి పేషీ చూట్టే తిరుగుతూ పీఎలుగా పనిచేస్తాం అంటూ జబర్థస్తీ చేస్తున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రులు, ఇతరులకు పీఎల…

Read More

తెలంగాణలో మిశ్రమ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసిఆర్‌ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్‌…

Read More
error: Content is protected !!