సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం…
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకమని క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య లు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్ నగర్ సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో గల మధసూదన్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేద వారి ఇంట ప్రతిరోజు పండగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి రాజేష్, మహిళా నాయకురాలు పుష్ప,నాయకులు పాల్గొన్నారు.