పైసలు ఇయ్యకుంటే పనులు ఎట్లా చెయ్యాలే…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-13T121203.529.wav?_=1

పైసలు ఇయ్యకుంటే

పనులు ఎట్లా చెయ్యాలే…

◆:- ఏం చేయమంటారు…? ఎలా చేయమంటారు….!

◆:- ముందుకు సాగని ప్రత్యేక అధికారుల పాలన

◆:- ఒక్క ప్రత్యేక అధికారి కూడా గ్రామాలలో తిరగని వైనం

◆:- పంచాయతీ కార్యదర్శిలపై ఆర్థిక భారం

◆:- నిధులు, బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతుంది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శిల పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల జగదేవపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి సొంత డబ్బులతో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టిన గ్రామంలో విష జ్వరాలు విజృంభించడం ఇద్దరు అకాల మరణం చెందడం వల్ల పారిశుధ్య లోపం కారణమని చివరికి కార్యదర్శిని అధికారులు సస్పెన్షన్ చేశారు.

Panchayat Funds

 

1. చెత్త సేకరణ ట్రాక్టర్లతో తిప్పలు…..

పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ చాలా ముఖ్యం. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్ తో పాటు వాటి మరమ్మతులు చేపట్టడానికి కార్యదర్శులు సొంతంగా వారానికి రూ. వేయి రూపాయల నుంచి రెండు వేల వరకు వెచ్చిస్తున్నారు. వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ పనులు తాగునీటి వసతి బోర్ల మరమ్మతులు పైప్ లైన్ లీకేజీలు తదితర పనులకు నెలకు పదివేల పైగానే ఖర్చు అవుతున్నాయి. కార్యదర్శులు ఆర్థిక భారంతో సతమతమవు తున్నారు. మొన్న ముగిసిన వినాయక నిమజ్జనం ఏర్పాట్లకు కూడా అదనంగా భారం పడిందని కార్యదర్శులు వాపోతున్నారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటును కూడా అంతంత మాత్రమే. చేపట్టారు.

2. నిధులు రాక… గ్రామాల అభివృద్ధి గాలికి…

గ్రామాల్లో ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన 15 ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్ సి నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా, వాణిజ్య పనులను వసూలు చేసి ఖజానాలో జమ చేసిన తర్వాత విడుదల చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జిపిల విద్యుత్ బిల్లులు చెక్కులు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నప్పటికీ జమ కావడం లేదు. ఆర్థిక భారం భరించలేక పలువురు కార్యదర్శులు వసూలైన పన్నుల డబ్బులను ఖర్చులను నిమిత్తం వినియోగిస్తూ బిల్లులు పెట్టుకుంటున్నారు. అందుబాటులో

3. బతుకమ్మకు ఏర్పాట్లు ఏట్లా…

బతుకమ్మ దసరా పండుగకు ఇక మిగిలింది పది రోజులే గ్రామాల్లో బతుకమ్మ కుంటల మరమత్తు పనులు విద్యుత్ దీపాలు అలంకరణ వంటి సౌకర్యాలు కల్పించాలి. గ్రామపంచాయతీ లో డబ్బులు లేకపోవడం ఇప్పటికే అదనంగా కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టుకొని వివిధ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ బతుకమ్మ దసరా ఉత్సవాలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని కార్యదర్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతున్నారు.

4. గ్రామాల్లో తిరగలేక పోతున్నాం….

ప్రజల నుండి వచ్చే సమస్యలను తీర్చలేక సొంత డబ్బుల తో, మరియు అప్పులు తెచ్చి చేస్తున్నాం. అతివృష్టి వలన కలిగిన వానలతో డ్రైడే నిర్వహించి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూస్తున్నాం. టాక్టర్ల ద్వారా పిచ్చి మొక్కలను, నీటి నిల్వలను శు భ్రం చేస్తున్నామన్నారు. ఇప్పుడు వచ్చే ఈ పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించగలని కోరుతున్నారు.

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి..

మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ డిమాండ్లు….

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ
శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే…

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే
ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే

ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి
జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..

రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్…

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు..,
కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు…!వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి, తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ ను చేర్చాడు‌. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు.
సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన, కష్టం .. తనను కదిలించిందని, తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ..పని చేసానని కానిస్టేబుల్ అలీమ్ తెలిపారు‌.
ఈ..రోజు ఉదయం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి, అతనిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు..
జిల్లా పోలీస్ బాస్ గా అనేక రకాల పనుల వత్తిడిలో ఉన్నప్పటికీ…, తన సిబ్బంది పనితీరును గుర్తించడం, వారిని ప్రశంసించి, ప్రోత్సహించడమే కాక, స్వయంగా తానే కానిస్టేబుల్ ను సత్కరించి అభినందించడం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పెద్దమనుసు కు ఒక ఉదాహరణ అని అక్కడ ఉన్న రైతులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రశంసించారు‌. ఉన్నతాధికారులు తీసకునే ఇలాంటి నిర్ణయాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనను కలిగిస్తాయని పలువురు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు కృతజ్ఞతలు తెలిపారు‌..
ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

“సర్వే నం.26లో అక్రమ కట్టడాలపై సిపిఐ ఆగ్రహం…

సర్వే నంబర్ 26లో అక్రమ కట్టడాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని సీతారాంపూర్ పరిదిలోని సర్వే నెంబర్ 26లో ప్రభుత్వ పరంపోగు భూమిలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగలపారక సంస్థ పరిధిలో ఉన్న సీతారాంపూర్ లోని సర్వే నెంబర్ 26లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పరంపోగు భూమిలో భవనాలు నిర్మించారని వీటికి ఇంటి నెంబర్లు మున్సిపల్ అధికారులు ఎలా ఇచ్చారన్నారు. పరం పోగు స్థలములో బహుళ అంతస్తులు, లగ్జరీ డూప్లెక్స్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మించి అమ్ముతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలను ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను బై నెంబర్లు వేసి ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేసి అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరంపోగు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ స్థలంలో ఇంటి నెంబర్ ఇచ్చిన మున్సిపల్ అధికారులను, కరెంటు మీటర్ ఇచ్చిన విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మిస్తుంటే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల మౌనం చూస్తుంటే ఇందులో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు నిర్మించి అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంటనే అరెస్టు చెయ్యాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సర్వేనెంబర్ 26లో ఉన్న భవనాలన్నింటినీ స్వాధీన పరుచుకుని ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదల తోటి ఇండ్లను ఆక్రమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ ఈభూమిని పరిశీలించిన వారిలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ వ్యతిరేక ఆందోళన…..

జహీరాబాద్ లో ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి…

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి

నేటి ధాత్రి కథలాపూర్

 

 

కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండల అధ్యక్షులు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మండల సేవాపక్షం ఇంచార్జి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ….. బిజెపి జాతీయ పార్టీ . పిలుపుమేరకు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. 19 గ్రామాల్లో రక్తదానం,స్వచ్ఛభారత్, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి జన్మదినవేడుకలు, తెలంగాణ విమోచన దినోత్సనం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్ లు గెలవాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మారుతి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గంగారాం,ప్రమోద్,శ్రీకర్, మహేష్,వినోద్,నారాయణ పాల్గొన్నారు.

సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి..

సబ్సిడీ చేప పిల్లల రాకపోవడంపై ప్రభుత్వం పట్ల అసంతృప్తి

ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్.

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రము అంతటా చెరువులు కుంటలు రిజర్వాయిర్ ప్రాజెక్ట్ లు నిండు కుండల ఉండి మత్తళ్ళు దునుకుతుంటే. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేప పిల్లలు రాక చేపల వృత్తే జీవనధారంగా కొన్ని లక్షల మంది మత్స్య కారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎన్నికలముందు వారు ఇచ్చిన హామీలు నమ్మి ప్రతి మత్స్య కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని ఒక్కవైపుగా మద్దతూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం అయినా మాట అందరికి తెలిసిందే. కానీ గత సంవత్సరం అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయి నాసి రకం చేప పిల్లలు పోయాడంతో పాటు కేటాయించిన చేప పిల్లలు పోయాక దొంగ లెక్కలు చూపి మత్స్యకారులను దగాచేసినారు ఈ సంవత్సరం జులై మాసం లొ పొసే సబ్సిడీ పిల్లలు సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికి ప్రభుత్వం ఇవ్వకపోవడం మత్స్యకారులు ప్రభుత్వం పై కన్నెర్ర చేయడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జీవనధారం కోల్పోయిన మత్స్య కారులకు. భృతి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం…

జహీరాబాద్: విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సీతారం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఎ జిల్లా మాజీ కార్యదర్శి మాణిక్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా విద్యను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు,…

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ స్థాయి సమావేశము ప్రధానోపాధ్యాయులు శ్రీ కుమారస్వామి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభను ఉపన్యాసాల రూపంలో మరియు కవితల రూపంలో నృత్య రూపంలో పాటల రూపంలో ప్రదర్శించినారు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ హిందీ మన భారత దేశ రాజభాషగా 1949 వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగంలో గౌరవించడం జరిగినదని హిందీ మన భారత దేశ సంస్కృతిలో భాగమని మన భారతదేశంలో హిందీ మాట్లాడేవారు తెలిసినవారు అత్యధికమైన వారు ఉన్నారని స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ భాష ఎంతగానో తోడ్పడిందని మహాత్మా గాంధీ గారు దేశమంతా తిరుగుతూ స్వతంత్ర అవసరాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో హిందీ భాషలోనే ప్రజల్ని పోరాటంలో పాల్గొనేలా హిందీ నే అధిక ప్రాధాన్యత పొందిందని తెలియజేశారు
అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భూపాలపల్లి జిల్లా హిందీ ఫోరం అధ్యక్షులు శ్రీ నోముల రవీందర్ గారు మాట్లాడుతూ హిందీ మన రాష్ట్రంలో ద్వితీయ భాషగా అమలులో ఉన్నదని హిందీని నేర్చుకోవడం ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రాణించవచ్చునని హిందీ ద్వారా వివిధ రకాల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా బ్యాంకుల్లో రైల్వేలో విమానయాన సంస్థల్లో ఆర్మీలో నేవీలో మరియు సమాచార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం…

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జె ఎన్ యు విద్యార్థి ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది.. అనంతరం ఎన్ ఈపి పై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెమినార్ కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ దామర కిరణ్ అనంతరం వారు సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని వారు దుయ్యబట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే లాగా ఉందని వారు అన్నారు.. అనంతరం ఈ యొక్క విధానాన్ని ఈ నిర్ణయాని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా అన్నారు ఈ యొక్క విద్యా విధానం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.. ఏదైతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో దానిని నెరవేర్చాలని అన్నారు.. అనంతరం సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అని వారు అన్నారు మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం పైన నిధులు కేటాయిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. ఒక దిక్కు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు అని వారు అన్నారు ఈ సమస్యలను ఇలా ఉన్న ప్రభుత్వానికి పట్టడం లేదా అని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ 8వేల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని అని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో అత్య భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలని వారు అన్నారు దాంతోపాటు ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకునే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ కు పక్క భవనాలు నిర్మించాలని అని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అందులో చదువుకునే పేద విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అని వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల విద్యార్థులు అందరికీ ఏకం చేసి భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఎస్ఎఫ్ఐ కాలేజీ కమిటీ సభ్యులు వంశీ రాజేష్ రవితేజ శ్రీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

 

మొగుళ్లపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఏ.ఎన్.ఎం .ఆశా వర్కర్లు చేయడం జరిగినది. అదేవిధంగా ఇసి పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో 55 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ రక్త నమూనాలు తీసి ల్యాబ్ కు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ మండలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల ,సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో డ్రైడే కార్యక్రమాన్ని అనగా ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొని వాటిని డ్రై చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా, పుట్టకుండా జాగ్రత్తలు వహించాలని ,జ్వరం వచ్చినట్లయితే మా వైద సిబ్బందికి తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సి .హెచ్ .ఓ. రాజేంద్రప్రసాద్ ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,అన్ని గ్రామాల ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి…

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్
విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు
ఐదు తరగతులకు ఒకే టీచర్ ఉన్నారని తిరిమాల్ తెలిపారు
5 తరగతులకు ఓకే గది ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు
పాఠశాలలో మరుగుదొడ్లు వసతులు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వన్ని కోరారు

మంచిర్యాల లో సెప్టెంబర్ 15 న వందే భారత్ రైలు ప్రారంభం…

మంచిర్యాల లో సెప్టెంబర్ 15 న వందే భారత్ రైలు ప్రారంభం

మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా వందే భారత్ రైలు ప్రారంభించడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ 20101 నాగ్ పూర్ – సికింద్రాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని,అధికారులు, ప్రజలు హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
బిజెపి.ఆర్ఎస్ఎస్. లకు పోరాటానికి ఎలాంటి సంబంధం లేదు
ఉద్యమ కాలంలో తెల్లదొరల సేవలో ఆర్ఎస్ఎస్. బిజెపి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినకమ్యూనిస్టులు నిజాం ప్రభువు, రజాకార్లు భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్ట్ లు అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంలో ముస్లింలు సైతం ముఖ్యపాత్ర పోషించారు. అని అన్నారు. పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లీం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చుక్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ .సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ పై స్టడీ.సర్కిల్ . ఏం చుక్కయ్యగారు బోధించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనలో తెలం గాణ ప్రాంతం మంత వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్‌. పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

 

 

 

దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెకరాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి. మల్లు స్వరాజ్యం. కృష్ణమూర్తి. మల్లు వెంకట నరసింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, అన్నారు సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ. బాంచన్‌ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కే నారాయణరెడ్డి. మడిగే నాగరాజు. గుండెకారి బాబురావు వరికల్ గోపాల్ రావు .గుండెకారి. చిన్న మహేందర్. కే కవిత.రాజేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం…

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం

కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాలు

భూపాలపల్లి నేటి ధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జామా మసీద్ ప్రాంగణంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల మత పెద్దలు మతగురువులు ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ఉంది అందులో వివాహాలను నిర్వహించే మత పెద్దలు గురువులను భాగస్తులను చేస్తూ బావి భారతం నిర్మాణానికి మత గురువులు చేయుటనివ్వాలంటూ నేడు జామా మసీద్ కమిటీ సభ్యుల చే బాల్యవివాహాలను అరికట్టడం కోసం బాలికల అభ్యున్నతి కోసం బలమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు హబీబ్ ఆఫీజ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబర్ ఇస్మాయిల్ ఫయాజ్ ముస్లిం సోదరులు మరియు చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ సామల శ్రీలత, నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ట్స్ కళాశాలలో 15, 16 తేదీలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్…

ఆర్ట్స్ కళాశాలలో 15, 16 తేదీలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్.
సుబేదారి, నేటి దాత్రి

 

 

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం ,బీఎస్సీ, బి ఎ (ఆనర్స్) మొదటి సంవత్సరంలో అడ్మిషన్ కోసం ఈనె 15 ,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతుందని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ కు వచ్చే విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) టెన్త్ మేమో, ఇంటర్మీడియట్ మేమో, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీని కూడా వెంట తీసుకొని రావాలని, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు వెనువెంటనే సంబంధిత కోర్సు ఫీజును చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందిన విద్యార్థుల కు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందన్నారు.

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం…

కలగా మిగిలిపోయిన ఓడేడు వాగు బ్రిడ్జి నిర్మాణం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయని రాజకీయ నాయకులు అధికారులు అని సిపిఐ ఎంఎల్. జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్ళపల్లి పెద్దపెల్లి జిల్లా మహా ముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు
ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రెండు జిల్లాల ప్రజలు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాల అరిచేతుల పెట్టుకోవాల్సిందే ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగు విస్తృతంగా రావడంతో ఇంద్రమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి మానేరు వాగును సందర్శించడం జరిగింది . 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయినది బ్రిడ్జి పూర్తి కాలేదు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతి వర్షాకాల సీజన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయి . ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన రెండు జిల్లాల పాలకులు స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజుజిల్లా ఉన్నతాధికారులు సందర్శించినారు తక్షణమే ప్రభుత్వాన్ని నివేదిక పంపి బ్రిడ్జి పనులు ప్రారంభించే..దిశగా ప్రజల కోరికను నెరవేర్చాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలనిఅన్నారు రాజు పాల్గొన్నారు

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం…

ఆర్ట్స్ కళాశాలలో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమం
సుబేదారి, నేటిదాత్రి

 

 

 

జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హిందీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ హిందీ దివస్ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం పూర్వ ఆచార్యులు సంజీవ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ఆరువేల మిలియన్ ప్రజలు మాట్లాడుతున్నారని, ఇది ప్రపంచ భాషగా ఎక్కువగా గుర్తింపు పొందిందని, అంతేకాకుండా పరిపాలకులు ఎవరూ ఉంటే వారి అనుకూలమైన భాషను రాజభాషగా అమలు పరుస్తారని భారతదేశాన్ని ఆంగ్లేయులు, ముస్లింలు పరిపాలించినప్పుడు వారి వారి పరిపాలన కాలంలో పరిపాలనకు అనుకూలమైన భాషను అధికార భాషగా గుర్తించడం జరిగిందన్నారు. భాష ఒక ప్రాంతం, ఒక వ్యక్తి మధ్య అవినాభావ సంబంధాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. భాషను నేర్చుకోవడానికి నిరంతర అధ్యయనం అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ భారత దేశంలో 60 శాతం మంది ప్రజలు మాట్లాడే భాష హిందీ అని కాబట్టి ఇది రాజభాషగా కొనసాగుతుందని ఆమె అన్నారు, హిందీ భాష కంటే సంస్కృతం పట్ల విద్యార్థులు ఎక్కువగా మక్కువ చూపుతున్నప్పటికీ అధికార భాషగా సంస్కృతాన్ని ఎక్కడ వాడడం లేదని కాబట్టి హిందీ భాష ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిందీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు హిందీ భాషను చదవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పరహా ఫాతిమా మాట్లాడుతూ హిందీ భాష జాతీయ సమైక్యతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఆంగ్లం కేవలం సాంకేతిక అభివృద్ధి కొరకే దూదపడుతుంది గాని హిందీ నిత్యజీవితంలో వాడుక భాషగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ నాగయ్య, మంజుల, శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version