పల్లె పోరుకు సిద్ధం!…..

పల్లె పోరుకు సిద్ధం!…..

◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు

◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం

◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి

◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు

◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20

◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది.

సంగారెడ్డి,పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తిం పు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందు లో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణ లో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ర్టాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్‌ పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది. ఇక, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతోంది. ఇక, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్టు సమాచారం.

పంచాయతీ గుర్తులివే..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తులపై తుది కసరత్తు పూర్తయ్యింది. సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్‌ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్‌, లేడీ పర్సు, టీవీ రిమోట్‌, టూత్‌ పేస్టు, స్పానర్‌(పానా), చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డు, బెండకాయలు, కొబ్బరితోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైట్‌, బ్రష్‌, క్రికెట్‌ బ్యాటర్‌, పడవ, బిస్కెట్‌, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ వికెట్లు

వార్డు సభ్యుల గుర్తులు

గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీ స్టిక్‌ మరియు బంతి, నెక్‌ టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టె, విద్యుత్‌ స్తంభం, కెటిల్‌.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్లే హాట్‌టాపిక్‌గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పం చాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించకుం టే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారు. పం చాయతీ ఎన్నికల్లో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండడంపైనా తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రా మాల్లో సామాజికవర్గాల జనాభాశాతం, మహిళల సంఖ్యతోపాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. గతసారి వచ్చిన రిజర్వేషన్‌ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్‌ను కేటాయించాలని అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేస్తున్నారు.మొత్తంగా ఎన్నికల కోడ్‌ వెలువడకముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలను గుర్తించింది. వీటన్నింటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. దాని ప్రకారం మొత్తం 12,848 గ్రామ పంచాయతీల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా, 570 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం

రాష్ట్రంలోని పంచాయతీల వివరాలు

జిల్లా గ్రామపంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు

ఆదిలాబాద్‌ 473 166 20

భద్రాద్రి కొత్తగూడెం 478 236 22

హన్మకొండ 210 129 12

జగిత్యాల 385 216 20

జనగాం 280 134 12

భూపాలపల్లి 248 109 12

జోగులాంబ గద్వాల 255 142 13

కామారెడ్డి 536 237 25

కరీంనగర్‌ 318 170 15

ఖమ్మం 579 288 20

అసిఫాబాద్‌ 335 127 15

మహబూబాబాద్‌ 482 193 18

మహబూబ్‌నగర్‌ 423 175 16

మంచిర్యాల 306 129 16

మెదక్‌ 492 190 21

మేడ్చల్‌ మల్కాజిగిరి 34 19 3

ములుగు 174 87 10

నాగర్‌కర్నూల్‌ 460 214 20

నల్లగొండ 868 352 33

నారాయణపేట 276 136 13

నిర్మల్‌ 400 157 18

నిజామాబాద్‌ 545 307 31

పెద్దపల్లి 266 140 13

రాజన్న సిరిసిల్ల 260 123 12

రంగారెడ్డి 531 232 21

సంగారెడ్డి 633 276 27

సిద్దిపేట 508 230 26

సూర్యాపేట 486 235 23

వికారాబాద్‌ 594 227 20

వనపర్తి 268 133 15

వరంగల్‌ 317 130 11

యాదాద్రి భువనగిరి 428 178 17

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

shine junior college

అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు. . ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి మా వోయిస్టులు పరారయ్యారు. మరి కొంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం .భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిశాల గ్రామా నికి చెందిన గాజుల రవి అలియాస్ ఉదయ్ 40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ముగిసింది., అప్పటి రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధిలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గాజర్ల రవి పై 25 లక్షల రివార్డు ఉంది గాజుల రవి మృతితో టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛా యలు అలముకున్నాయి.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య

ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ

కేసముద్రం నేటి ధాత్రి:

 

 

shine junior college

కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు

జైపూర్ నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్ చేసి తన మొబైల్ 17వ తేదీ మంగళవారం బానోత్ సురేష్ కి జైపూర్ పోలీసులు అందజేయడం జరిగింది.ఎవరి ఫోను చోరీకి గురైన ఎక్కడైనా ఫోన్ మిస్సయిన ఆందోళన చెందకుండా సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 140 లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం మొరంచపల్లి నుండి మంజూరునగర్ వరకు వరకు సాగిన పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో అతిథులు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మంజూరునగర్లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామున్నారు. 

Groundbreaking ceremony

ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం, మరో 30 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేసామన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలల్లో గుమ్మడి శ్రీదేవి అప్పం కిషన్ విస్లావత్ దేవన్ పిప్పాల రాజేందర్ సుంకర రామచంద్రయ్య పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు…

కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

ఆపరేటర్లకు భారంగా మారుతున్న పోల్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ రావు డిమాండ్ చేశారు…

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని సింగరేణి ఫంక్షన్ హాల్ లో కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది…ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షులు వేశాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదురుకుంటున్న సమస్యల పై చర్చించారు…ముక్యంగా ఆపరేటర్లు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు..ప్రభుత్వాలకు,ప్రజలకు నిత్యం వారధి లా ఉండే కేబుల్ టీవీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందన్నారు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబుల్ ఆపరేటర్లకు కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదన్నారు…అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన.. ఆచరణ లోకి రాలేదని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు..ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పట్టించుకోవాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం నాయకులు కోరారు..ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్, జయశంకర్ విగ్రహం మీదుగా జెన్కో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు…అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించారు…పోల్ టాక్స్ ను రద్దు చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు…

ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ సింబల్‌బోర్డ్‌లో ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్‌లోని ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో ఎలాంటి రాతలు లేవు. AIMIM జహీరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, జమాత్ ప్రతినిధులు మా ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకుని, మొదట ఆ పనిని నిలిపివేసి, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్రభుత్వం ఉర్దూలో మాట్లాడుతున్నప్పటికీ, ఉర్దూను విస్మరించారని మరియు R&B శాఖ ప్రతినిధులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు,అతను జహీరాబాద్ RDO సిబ్బంది తో R&B గురించి మాట్లాడాడని నోటీసు జారీ చేశాడు. 

Ε.Ε మరియు A E తో ఫోన్‌లో మాట్లాడి, ఈ బోర్డుపై ఉర్దూ రాయడం పూర్తి చేయని వరకు,ఈ బోర్డును అమర్చడానికి మేము అనుమతించబోమని డిమాండ్ చేశాడు. దీనిపై, టౌన్ S.I వినయ్ కుమార్ R&B శాఖ ప్రతినిధులతో మాట్లాడి A.E సంధ్య ను ఫోన్ చేసి, వారిద్దరూ కలిసి 24 గంటల్లో దానిపై ఉర్దూ రాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం జాయింట్‌ సెక్రటరీ మొహియుద్దీన్‌ గౌరీ సాహబ్‌, అమీర్‌ బిన్‌ అబ్దుల్లా,షేక్‌ ఇలియాస్‌, వార్డెన్స్‌ అందగాడు షేక్‌ సద్దాం,మహమ్మద్‌ ముజీబ్‌ జమాత్‌ నాయకులు మహ్మద్‌ అలీం,మహ్మద్‌ ఫరూఖ్‌,మహమ్మద్‌ సమీర్‌, మహ్మద్‌ అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత  మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ,  వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్*

25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన…..

వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్…

వరంగల్, నేటిధాత్రి : 

 

shine junior college

శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కమిషనర్ తనఖి చేశారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్ లు సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం విధులకు హాజరై, వెళ్లేటప్పుడు నమోదు చేయాలని , అటెండెన్స్ నమోదులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుండి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కలియతిరిగిన కమిషనర్ స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్షిత చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ఇందుకు సంబంధించిన స్టిక్కర్ ను గృహాలకు అతికించి నిర్వహించిన స్వచ్చ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డి ఆర్ సి సి సెంటర్ తో పాటు నర్సరీనీ పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించిన కమిషనర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సి పి లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్ వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్ రావు ఏం హెచ్ ఓ డా.రాజేష్ ఏ సి పి ఖలీల్ సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ ఏ ఈ లు మొజామిల్ హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య గ్రామ అధ్యక్షులు పేట రాజు సమ్మయ్య ఉపాధ్యక్షులు అంబాల సంజీవ్ కార్యదర్శి నిట్టూరి అంకయ్య ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ ప్రచార కార్యదర్శి పేట రవి నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరగబోయే ఊరు ఊరునా దండోరా జెండా జూలై 7న ఘనంగా ఆవిష్కరించుకొని ఈ దేశంలోనే మాదిగ జాతి ఒక శక్తివంతంగా ఎదిగి సబ్బండ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ ఈ క్రమంలో జాతి చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని సామాజిక న్యాయం సాధించిన తరుణంలో విజయోత్సవాలు చేసుకోవాలని మండలంలో గ్రామాల ప్రజలు యొక్క దండోరా విజయాలని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు జూలై 7న జెండా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య పేట దేవేందర్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంత్రి రవితేజ చింతకుంట సదానందం చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు

సంకల్ప సభను విజయవంతం చేద్దాం .

సంకల్ప సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

shine junior college

 

శాయంపేట మండలం మైలారం గ్రామంలో గురు వారం అనగా19-06-2025 ఉదయం 10 గంటలకు వికసి త్ భారత్ యొక్క అమృత కాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం గడచిన సందర్భంగా సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారత దేశం అభివృద్ధి పథంలో వేగం గా ముందుకు సాగుతున్న తరుణంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమృతకాల సేవా సుపరి పాలన సంకల్పసభ విజయ వంతం కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలలో భాగంగా గత 11 సంవత్సరాలలో పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమ లుపై కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల మద్దతుతో మరింత బలపరచ డానికి ఈ సంకల్ప సభ నిర్వహించబడు తుంది కావున మండలంలోని రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల పతాధికారులు, సీనియర్ నాయకులు పార్టీ శ్రేయోభిలాషులు మరియు మండలంలోని పురప్రముఖు లు అందరూ హాజరై సంకల్ప సభను విజయవంతం చేద్దాం

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి.

అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి
భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు
రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో
జమ్మికుంట :నేటిధాత్రి

 

shine junior college

 

 

జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది అలాగే కొంతమంది బినామీ పేర్ల పైన కొత్త పాసు బుక్కు ఉండంగా కూడా వాళ్లు వేలిముద్ర వేయకుండా వాళ్ల సంతకాలు పెట్టకుండా వేరే వాళ్లకు మార్పు చేయించినాడు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఆట స్థలాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇట్టి పోరుపై చాలాసార్లు కలెక్టర్ను ఆర్డీవోను ఎమ్మార్వో మారినప్పుడల్లా మా బాధలను వినిపిస్తున్నాము ఈ అక్రమార్కుని పై పోరాటం చేస్తూనే ఉన్నాము కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈరోజు భూభారతి కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో జరుగుతుందని తెలుసుకుని బాధితులంతా రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపినారు తర్వాత అధికారులకు వారి యొక్క వినతి పత్రాలు అందజేసినారు ఇకనైనా ఈ భూభారతి లోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు కనుక అధికారులు గమనించి సమగ్ర విచారణ జరిపి పేదల భూములు వారి వారికి పాసుబుక్కులు ఇప్పించాలని బాధితులంతా కోరుకోవడం జరిగింది

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హసన్ పర్తి మండలం పెంబర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ, నేటిధాత్రి:

shine junior college

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లబ్ధిదారులకు సూచించారు.
మంగళవారం హనుమకొండ హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణాలు, రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్ల నిర్మాణ పనులను ఏ విధంగా చేయిస్తున్నారని, మేస్త్రీలు ఇంటి నిర్మాణానికి ఎంత తీసుకుంటున్నారు, నిర్మాణ పనులను ఎప్పటి వరకు పూర్తి చేస్తారని, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేస్తున్నారా అని లబ్ధిదారులు స్వరూప, రజిత, నిర్మల, అరుణ, సమ్మక్క, మంజుల, సులోచన, రాజేశ్వరిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, కాబట్టి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ రహీం పాషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు…

అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల.

పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలి

హన్మకొండ, నేటిధాత్రి:

 

shine junior college

 

 

స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా 15 రోజుల పాటు పిల్లలు అతిసార వ్యాధికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని ఓ ఆర్ ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలనిహనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు .ఈరోజు హనుమకొండ పట్టణ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్సీ కడిపికొండ కు సంబంధించిన వైద్యాధికారులు సూపర్వైజర్లతో కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా కేసులు రాకుండా సంబంధిత విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ ,ప్రజల్లో అవగాహన కలిగిస్తూ పాజిటివ్ వచ్చిన ఏరియాలో తగిన చర్యలు తీసుకోవాలని , ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటించాలని డ్రైడే ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలని అలాగే గ్రామాల్లో మరియు పాఠశాలల్లో వైద్య శిబిరములు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల పరిశుభ్రత పై ,పరిసరాల పరిశుభ్రత వంటి అంశములపై అవగాహన కలిగించాలన్నారు. టీవీ ముక్త అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతోపాటు టీవీకి చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి పోషణకు సంబంధించిన అవగాహన ,తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్,అడిషనల్ డి ఎం హెచ్ ఓ మరియు ఇన్చార్జి మలేరియా అధికారి డాక్టర్ టి మదన్ మోహన్ రావు ఆరోగ్య కేంద్రాల వారీగా మెడికల్ క్యాంపులు ,అలాగే పాజిటివ్ కేసులు (తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించగా, జిల్లా ఎమినైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్,మరియు రోట వైరస్ వ్యాక్సిన్ ల గురించి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు టీబీ ముక్తాభియాన్ అలాగే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తదార్ అహ్మద్ఎన్సిడి, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల తగిన సూచనలు చేయడం జరిగింది.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు..

*అసైన్డ్ భూమి సాగు చేసుకుంటున్నా దళిత గిరిజన రైతులు స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

*వర్ధన్నపేట పట్టణ శివారు లోని గువ్వల బోడు 118 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

*వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని గువ్వల బోడుకు చెందిన ప్రభుత్వ భూమిని నేడు స్వయంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో గారితో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

 

వర్ధన్నపేట( నేటిధాత్రి ):

 

shine junior college

నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం రోజున ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలన చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే నాగరాజు రావడం పట్ల గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూసుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటపడిపోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని మరొకసారి నిరూపించుకోవడానికి సమయం ఆసన్నమైందని వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

 

“మా పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప బహుమతి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నట్లు పట్టణ ప్రజలు తెలియజేశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు పట్టణ, మండల పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు…

 

వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం కోసం వర్ధన్నపేట పట్టణ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ మరియు మున్ఫిక్ కోర్టు, సబ్ డివిజన్, సబ్ జైలు పలు ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానన్నారు. స్థానిక దళిత, గిరిజన రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అని ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు. గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

 

వర్ధన్నపేట నియోజకవర్గం విద్యాభివృద్ధికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మైలురాయిగా నిలవనుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి
టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్
బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

shine junior college

 

 

 

దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి.

ప్రభుత్వ పాఠశాలను కాపాడాలి

బడిబాట కార్యక్రమం నిర్వహించని వారిపై చర్య తీసుకోవాలి…

నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ పై చర్య తీసుకోవాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

 

టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాల ను కాపాడాలని బడిబాట కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించి ప్రభుత్వ స్కూల్లో చదివే విధంగా తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలని ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కానీ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక్కరోజు కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించిన దాఖలు లేవు … ఈ పాఠశాల మూతపడే పరిస్థితి ఉంది ఇందులో ఒక విద్యార్థి కూడా వచ్చిన దాఖలు లేవు వచ్చిన ఉపాధ్యాయుడు మాత్రం కూర్చుండి వెళ్ళిపోతున్నాడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు…. ఈ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు మాత్రం ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపే విధంగా ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యం ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు టాటా మ్యాజిక్ ల ద్వారా తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడే సక్రమంగా రాడు మా పిల్లలు ఏమి చదవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో ఉన్నటువంటి మండల అధికారి ఎంఈఓ గారు కనీసం స్పందించిన దాఖలు లేవు ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల పైన చర్య తీసుకున్న పరిస్థితులు లేవు విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాల వాళ్ళు అధికఫీజులు తీసుకుంటూ డ్రెస్ కోడ్ పేరుతో బుక్స్ పేరుతో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారు అయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎంఈఓపై చర్య తీసుకోవాలని అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలల కు టాటా మ్యాజిక్ ద్వారా పిల్లలను తీసుకపోతున్న ప్రైవేటు యజమాన్యంపై చర్యలు తీసుకొని స్కూలు గుర్తింపు రద్దు చేయాలని అన్నారు తక్షణమే బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్చి అంకుషాపూర్ ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు .

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

-MEO లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

shine junior college

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడ పాఠశాల నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలను గురువారం మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి తెలిపారు. మంగళవారం మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సన్నద్ధత సమావేశoలో ఆయన మాట్లాడారు. ఎంపికు వచ్చే అభ్యర్థుల వయస్సు 8 నుండి 9 సంవత్సరాలలోపు (అనగా 01.09.2016 నుండి 31.08.2017 వరకు) ఉండాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, మండల స్థాయిలో ఎంపికలు తేది 19.06.2025న మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల స్టడీ సర్టిఫికెట్,
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో( కలర్).మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జిరాక్స్ఆధార్ కార్డు జిరాక్స్.కమ్యూనిటీ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని కోరారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఎం.ఆర్.సీ, సీ.సీ.వో వేణును 9866744719 చరవాణిలో
సంప్రదించాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, మహేష్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు.

ఆర్థిక సహాయం అందించిన మండల అధ్యక్షులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా..నేటిధాత్రి..

 

 

shine junior college

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన బంధు ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో గాయపడి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తనవంతుగా ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version