
"Pet Cat Kills Snake, Saves Owners"
పామును చంపిన పిల్లి… ఇంటి ఓనర్స్ ను కాపాడి మరీ
జహీరాబాద్ నేటి ధాత్రి;
ఝరాసంగం: పెంపుడు జంతువులు, మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ తరుణంలోనే ఓ పిల్లి… తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. నాగుపాము బారి నుంచి ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగింది.మంగళవారం అర్థరాత్రి గొల్ల నర్సమ్మ-సిద్దన్న దంపతులు ఇంట్లో నిద్రలో ఉండగా, నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. ఈ దృశ్యాన్ని గమనించిన వారి పెంపుడు పిల్లి… ఆ పాముపై దాడి చేసి అడ్డుకుంది. వేటాడి దానిని చంపేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం లేచిన దంపతులు… ఇంట్లో చనిపోయి ఉన్న పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది పిల్లి ధైర్యంతో ఊపిరిపీల్చుకున్నారు. చంపిందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు