కుల వివక్షత చూపరాదు.

Revenue Inspector Preethi.

— కుల వివక్షత
చూపరాదు
• రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

గ్రామాలలో ఎవరు కులవివక్షత చూపరాదని అందరు సమానులే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు గ్లాసుల పద్ధతిని వీడనాడాలని, అంటరానితనం, కుల వివక్షత పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు హక్కులు కల్పించిందని హక్కుల ద్వారా మనిషి స్వేచ్ఛగా జీవించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చప్పేట నరసింహారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!