మిలర్ల మధ్య..కుల కుంపటి?

`ఎన్నికలలో గెలిచేందుకు ఇదొక్కటే దారి!

`రగులుతున్న ఆధిపత్య పంచాయతీ!

`మూడు కులాల మధ్య మూడు ముక్కలాట!

`తెలంగాణా వచ్చిన తర్వాత 12 ఏళ్లు కుర్చీ మీద ఒక కులం!

`పదేళ్లు సాగిన మరో కులం పెత్తనం!

`ఆ రెండు కులాల సంఖ్యతతో ఇంత కాలం సాగిన ఆధిపత్యం.

`ఇప్పుడు కుర్చీ కోసం మరో కులం ఆరాటం.

`కుర్చీ మాదే, పెత్తనం మాకే కావాలంటున్న ఆ కులం!

`గతంలో కుర్చీ ఒకరికి, పెత్తనం ఒకరికి పంచుకున్నారు.

`పదేళ్లు కలహం లేకుండా కాలం గడుపుకున్నారు.

`అప్పటి నుంచి మూడో కులం గుర్రుగా వుంది.

`అదును కోసం ఎదురుచూస్తూ వుంది.

`ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.

`దానిని వినియోగించు కోవాలని మూడో కులం చూస్తోంది.

`కుర్చీ గుంజుకునే రాజకీయం మొదలైంది.

`రెండు కులాల మధ్య చీలిక తేవాలని మూడో కులం ప్రయత్నం మొదలు పెట్టింది.

`రెండు కులాలలో వున్న అసంతృప్తులను దగ్గర చేసుకోవాలని చూస్తోంది.

`విభజించి పాలించే రాజకీయం మూడో కులం జోక్యంతో మొదలైంది.

హైదరాబాద్, నేటిధాత్రి:

కులం గట్టిగా వుంటే ఎన్ని కోటలైనా కట్టొచ్చు. ఎన్ని కోటలైనా కూల్చోచ్చు. అని చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. అందులోనూ ఆధిపత్య కులాల మధ్య వున్న ఐక్యత, ఇతర కులాల మధ్య లేకపోవడం కూడా వారి పెత్తనానికి పెద్దరికానికి దారి వేశాయన్న నిదర్శనాలు అనేకం కనిపిస్తాయి. ఏ రంగంలో చూసినా ఏదో ఒక కులం ఆదిపత్యం కనిపిస్తుంది. అందులోనూ సామాజికంగా ఎంతో కొంత ముందున్న కులాలే పెత్తనం చేస్తుంటాయి. అందుకు ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేదు. అందుకే వారి పెత్తనం నిరంతర ప్రవాహంలా సాగుతోంది. అయితే ఆ కులాల మధ్య కూడ అప్ప్పుడప్ప్పుడు అంతరాలు, ఆక్రోషాలు, విభేదాలు పొడ చూపుతుంటాయి. అలా ఆ కులాల మద్య కుంపట్లతో చూరంటుకున్న సందర్భాలు వున్నాయి. ఇప్ప్పుడు తెలంగాణలోని మిల్లర్ల యూనియన్‌లో కూడా అదే కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, తెలంగాణ వచ్చినా ఈ పదేళ్ల కాలం పాటు ఓ కులానిది మిల్లర్ల సంఘంలో పెత్తనం, పెదరికం వుండేవి. ఆ వర్గానికే కుర్చీ కూడా ఎప్ప్పుడూ సొంతమౌతూ వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కుర్చీతోపాటు, పెత్తనం సాగిన ఓ కుýం పెత్తనం వదులుకోవాల్సి వచ్చింది. కుర్చీ తమకే వుంది కదా! అని సర్ధుకుపోవాల్సి వచ్చింది. దాంతో ఆ రెండు కులాలా మధ్య పదేళ్లపాటు డీల్ సాఫీగా సాగిపోయింది. కుర్చీలో కూర్చున్న కులం సంతోషంగానే వుంది. కుర్చీతో సంబందం లేకుండా పెత్తనం చేసిన కుýం ఆనందంగానే వుంది. కాని అప్పటి నుంచి ఓ కులం రగిలిపోతూ వుంది. తమ పెత్తనానికి దారి దొరకడం లేదని అదునుకోసం ఎదురుచూసింది. ఆ పదేళ్ల కాలం పాటు వారికి చీమ కాలంత సందుకు కూడా దొకరలేదు. అలా అని ఆ కులం కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. అనువు గాని చోల అదికులమనరాదు! కొంచెముండుటెల్ల కొదువు కాదు..కొండ అద్దమందు కొంచెమై వుండదా!! అని ఆ కులం సర్ధు కుపోయింది. కాలం కలిసి రానప్ప్పుడు ఎన్ని కేకలేసినా ఎవరికీ వినపడదు. పైగా గొంతు నొప్పి మొదలౌతుంది. అందుకే ఆ కులం సైలెంట్‌గా వుంటూ వచ్చింది. అంత మాత్రానా ఆ కులానికి పెద్దగా ప్రాదాన్యత లేదని కాదు. కాని కుర్చీ లేదు. కుర్చీ ఎక్కే అవకాశం ఆ కులానికి రాలేదు. కాని ఎంతో కొంత పెద్దరికం, పెత్తనం నడిచింది. పూర్తిగా ఆ పెత్తనం వశం చేసుకునే అవకాశం రాలేదు. ఇప్ప్పుడు వచ్చింది. అవకాశం అందిపుచ్చుకోవాలన్న ఆలోచన ఆ కులంలో మొదలైంది. గత కొంత కాలంగా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సంఘం ఎన్నికల సమయం దగ్గరకొచ్చింది. ఎలాగైనా ఈసారి మిల్లర్ల ఎన్నికల్లో తమదే పై చేయి కావాలని ఆ కులం చూస్తోంది. అందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ఎంత అయితే పూర్తిగా వర్ వన్‌సైడ్ కావాలంటే ఆ కులం బలం ఒక్కటే చాలదు. ఆ కులానికి మిగతా రెండు కులాల మద్దతు కావాలి. అందుకు ఆ రెండు కులాలలో వున్న కొద్ది మంది అసంతప్తుల సహయసహాకారాలు అందాలి. ఎందుకంటే ఎంత పెద్ద సామాజ్య్రమైనా సరే ఎక్కడో అక్కడ ఎంతో కొంత అసంతప్తి వుంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా పేదరికం వుంటుందన్నట్లు, ఏ కులంలోనైనా సరే ముందుకు వెళ్లలేని వాళ్లు వుంటారు. వాళ్లకు ప్రాద్యాతన పెరుగుతుందంటే, మరో కులానికి సపోర్టు చేయడానికి వెనుకాడరు. పైగా విభజించి పాలిస్తే ఏదైనా సాద్యమౌతుంది. మన దేశానికి వ్వాపారానికి వచ్చిన వారు కూడ వారి ఆధిప్యతం కోసం రాజులను విభజించారు. తర్వాత ఆంగ్లేయులే పాలించారు. ఇది అన్ని రాజకీయాలకు మూల సూత్రమైపోయింది. ఇప్ప్పుడు మిల్లర్ల ఎన్నికల సంఘానికి కూడా ఉపయోగపడుతోంది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం అందాలంటే ఆ రెండు కులాýలో ఇబ్బందులెదుర్కొంటున్న మిల్లర్లను తమ వైపు తిప్ప్పుకుంటే చాలు అనుకుంటున్నారు. రాజకీయం రసవత్తరంగా సాగాలని చూస్తున్నారు. ఎంత సేపు ఆ కులాలలో వున్న కొంత మంది పెద్దలకు కుర్చీల మీద వున్న యావ మిల్లర్ల సమస్యల మీద లేదు. పెత్తనం మీద వున్న ఆశ మిల్లర్లకు మేలు జరిగే పరిస్దితి కనిపించడం లేదు. తెలంగాణలో ఇప్పటికీ బాయిల్డ్ రైస్ మిల్లర్లదే ఆదిపత్యం. పెత్తనం. పెద్దరికం. కాని పైకి మేడి పండులా కనిపించినా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నా,చితకా మిల్లర్లు చాలా మంది వున్నారు. వారి సమస్యలు పెద్ద మిల్లర్లకు పట్టవు. మిల్లర్ల అసోసియేషన్ పెద్దలకు పట్టవు. కుర్చీలు ఎక్కింది ఎవరికో సాయం చేసేందుకో కాదు.. తమ స్వార్ధం కోసమే అన్నట్లు పెద్దలు వ్యవహరిస్తుంటారు. చిన్న మిల్లర్లను ఇరికించేంది వారే. చిన్న మిల్లర్లను ఇబ్బందులు పెట్టేది వాళ్లే..వాళ్లకు న్యాయం చేసినట్లు నటించి పెత్తనం చేసేది పెద్ద మిల్లర్లే..యూనియన్ పెద్దలే. ఈ విషయం చిన్న మిల్లర్లకు ఎప్పటికీ అర్దం కాదు. అర్ధమైనా సరే ఎదించే దైర్యం ఎవరూ చేయలేరు. నిజానికి యూనియన్ పెద్దలు చిన్న మిల్లర్ల పరిష్కారం కోసం పనిచేయాలి. వారి సమస్యలను తీర్చేందుకు కషి చేయాలి. కాని కులాý మధ్య కుంపట్లు చిన్న మిల్లర్లను మింగేసే కుట్ర జరుగుతుందన్న సంగతి ఇప్పటికీ తెలుసుకోలేకేపోతున్నారు. చిన్న మిల్లర్ల అమాయకత్వాన్ని నేరుగా సొమ్ము చేసుకునేందుకు కూడా కొంత మంది తిమింగల మిల్లర్లు చూస్తున్నారు. ఆ సమయం కోసం కాచుకొని కూర్చున్నారు. ఈ మద్య చిన్న మిల్లర్ల చేత, ప్రభుత్వానికి బకాయిలు పడ్డ మిల్లర్లను రెచ్చగొట్టి రబీ వడ్లు తీసుకోమని చెప్పేలా రెచ్చగొట్టారు. ఆ సంగతిలో వున్న రాజకీయం అర్దం కాక చిన్న మిల్లర్లు ఓ కులం ట్రాప్‌లో పడిపోయారు. తెలంగాణలో డిఫాల్టర్లుగా తేలిన వారిలో చిన్న మిల్లర్లు కూడా వున్నారు. మొత్తం 600 మంది డిఫాల్లర్లలో చిన్న మిల్లర్లే ఎక్కువగా వున్నారు. వారి మిల్లులను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని, వేలం వేస్తే వాటిని ఓ కులం పెద్దలంతా ఏమైక దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకు కుర్చీ, పద్దరికం రెండూ కావాలని చూస్తోంది. ఎవరైతే బలి కానున్నారో వాళ్లనే పావులుగా చేసుకొని ఓ కులం రాజకీయం మొదలు పెట్టింది. రబీ సీజన్ అంతా దాదాపు బాయిల్ద్ మిల్లులకే వరి వెళ్లుతుంది. ఆ అవకాశం కూడా బాగా కలిసి వస్తుంది. ఒక్క దెబ్బకు అటు వ్యపారం, ఇటు రాజకీయం రెండూ సక్సెస్ అవుతాయని ఆ కులం ఎత్తుగడ వేసింది. కొన్ని దశాబ్దాలుగా మిల్లింగ్ వ్యాపారం చేస్తూ ఆది నుంచి పెత్తనం చేస్తున్న ఆ కులం నుంచి కుర్చీ లాగేసుకోవడానికి, ఆ కులం మిల్లులను మింగేయడానికి ఓ కులం కుట్ర బ్రహ్మాండగా సాగుతోంది. అదే జరిగితే భవిష్యత్తు అంతా ఆ కులానిదే అవుతుంది. భవిష్యత రాష్ట్ర రాజకీయాలు ఎలా వున్నా తమదే పై చేయి అవుతుందని ఆ కులం పద్మవ్యూహం పన్నుతోంది. అమాయకులైన ఆ కులం చిన్న మిల్లర్లను తప్ప్పుదోవ పట్టించి, మిల్లులను చెరపట్టాలని చూస్తున్నారు. మిల్లింగ్ వ్వాపారం నుంచి ఏకంగా ఆ కులాన్నే లేకుండా చేద్దామని చూస్తున్నారు. ముందు ఆ కులాన్ని మిల్లింగ్ వ్యాపారానికి దూరం చేస్తే భవిష్యత్తులో కుర్చీకి ఆ కులం అడ్డు వుండదని కూడా దీర్ఘ కాలిక స్కెచ్ వేస్తున్నారు. చిన్న మిల్లర్లు ఆ కుట్రలను పసిగడతారా? లేదా? సొంత కులం పెద్దలతో వున్న విభేదాలతో కుట్రలు చేస్తున్న కులంతో చేతులు Å£లుపుతారా? తిమింగలాలై వస్తున్న కులంకు ఎరలుగా మారుతారా? అనేది కాలమే చెప్పాలి. అది ఎంతో దూరంలో లేదు. చూడాలి!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version