సాధన మల్టీస్పెషల్టి హాస్పిటల్ పై కేసులు నమోదు చేయాలి.

యజమాని, డాక్టర్ పై క్రిమినల్ కేసులు చేసి హాస్పటల్ ను సీజ్ చేయాలి.
ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్
డిఎంహెచ్ఓ కు వినతి పత్రం అందజేత.

హైదరాబాద్/వికారాబాద్,నేటిధాత్రి:

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో మహిళా మృతికి కారణమైన సాధన మల్టీస్పెషల్టి హాస్పిటల్ పై కేసులు నమోదు చేసి యజమాని, డాక్టర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి హాస్పటల్ ను సీజ్ చేయాలని
ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ మాట్లాడుతూ పరిగి పట్టణ కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ పేరుతో కొనసాగుతున్న సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మహిళకు సరైన వైద్యం అందక డాక్టర్ల నిర్లక్ష్యంతో మరణించిన సంఘటన పట్ల సమగ్రమైన విచారణ జరిపించి మహిళ మృతికి కారణమైన ఆస్పటల్ యజమాన్యం, డాక్టర్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.సరైన అనుమతులు, సౌకర్యాలు లేకుండా మల్టీ స్పెషాలిటీ పేరుతో సేవలు అందిస్తున్న హాస్పిటల్స్, డాక్టర్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాములు, నాయకులు నర్సింలు,వెంకటయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!