మామిడిగూడెం ఆదివాసులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేత
న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్
నేటిదాత్రి చర్ల
చర్ల మండలం మామీడిగూడెం చెందిన 50 కుటుంబాలు 1995 నుంచి సర్వేనెంబర్ 62 మరియు 65 లో సాగులో ఉన్నారు ఈ మధ్యకాలంలో దుమ్ముగూడెం కు చెందిన ఫారెస్ట్ అధికారులు అక్రమంగా భూమిలోకి వచ్చి ఆదివాసులను బెదిరించి పంటలు పీకినట్టుగా మొక్కలు తీసేసినట్టుగా కేసులు నమోదు చేశారు తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ భూములను ఆదివాసి ప్రజలకు పంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల వచ్చిన భద్రాచలం ఐటిడిఏ పిఓ కు వినతిపత్రం అందించారు
అనంతరం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ చర్ల మండలంలో ఆదివాసి ప్రజలకు హక్కులు ఉన్న భూమిలోకి పోయే పరిస్థితిని ఫారెస్ట్ వారు కల్పించడం లేదని సాగులో ఉన్న భూములను గుంజుకొని అమాయకులైన ఆదివాసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం అని అన్నారు గతంలో కూడా ఫారెస్ట్ అధికారులకు గుర్తు చేశాం అయినా మామిడిగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలని అరెస్టు చేసి ఏడుగురుపై కేసు నమోదు చేసి ఒకరిని వదిలిపెట్టి ఇంకొక మహిళ ఎటుపోయారో తెలవని పరిస్థితిలో ఉన్నదని ఆచూకీ దొరకడం లేదని పిఓ కి గుర్తు చేశారు తక్షణమే ఆ మహిళ ఆచూకీ తెలపాలని సర్వేనెంబర్ 62 65 భూములు ఆదివాసి ప్రజలకు పంచాలని 1/70 యాక్టు ఏజెన్సీ చట్ట ప్రకారం ఇక్కడ ఆదివాసులని అధికారులు గానీ నియమించాలని ఇక్కడ ఫారెస్ట్ వారు సామాజిక వర్గాల తోటి అధికారం చలా ఇస్తున్నారని ఇది మానుకోవాలని వారన్నారు ఏ సామాజిక వర్గమైన పేద ప్రజలకు న్యాయం చేసేటట్టుగా చట్టాలకు అనుకూలంగా లోబడి పని చేయాలని వారు గుర్తు చేశారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఇంకో మహిళ ఆచూకీ వెల్లడించాలని లేనిపక్షంలో దశల వారి ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం అని అన్నారు అనంతరం భద్రాచలం ఐ టి డి ఏ పి ఓ మాట్లాడుతూ ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ తెల్లం పెంటమ్మ కొమరం సమ్మయ్య చల్లం శ్రీను శ్యామల అరుణ తెల్లం వెంకటరమణ కొమరం రామక్క తదితరులు పాల్గొన్నారు