మై రాడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెదముసిలేరు పంచాయతీకి 450 మొక్కలు అందజేత
ఎమ్ఎస్ కే సంస్థ ప్రతినిధి వీసంపల్లి నాగేశ్వరరావు
నేటి ధాత్రి చర్ల:
ఐటిసి ఎమ్ ఎస్ కే మైరాడ్ సంస్థ ఆధ్వర్యంలో పెదముసిలేరు గ్రామపంచాయతీ క్రీడా మైదానంలో సంస్థ ప్రతినిధి వీసంపల్లి నాగేశ్వరరావు మరియు పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది గ్రామంలో జీవవైవిద్యం కొరకు ఐటిసి ఎమ్ ఎస్ కే మైరాడ్ సంస్థ 450 మొక్కలు గ్రామపంచాయతీకి ఇవ్వడం జరిగింది ఈ మొక్కల వలన గాలిని శుభ్రపరచడం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు ఔషధ గుణాలున్న మొక్కల ద్వారా అనేక వ్యాధులకు చికిత్స చేయడం వంటివి ఉన్నాయి మొక్కలు వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయి మొక్కలు వాతావరణం వేడెక్కకుండా కాపాడుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఐటిసి ఎమ్ఎస్ కే మై రాడ్ సంస్థ ప్రతినిధి విసంపల్లి నాగేశ్వరరావు పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు