
Forest
అడవిని దున్నుతున్న ఒకరిపై కేసు నమోదు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి రేంజి పరిధిలోని బొమ్మెన 143 కంపార్ట్మెంట్ అడవిలో చామనపల్లికి చెందిన ధూపం కుమార్ ట్రాక్టర్ తో అడవిని దున్నతుండగా తమ సిబ్బంది పట్టుకున్నట్లు అటవీ రేంజ్ అధికారి హఫీజ్ ఖాన్ శనివారం తెలిపారు. ట్రాక్టర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిని దున్నితే చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.