మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో ఆయన ఉన్న కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని విద్యావంతుడు అయినా మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుపై ఓటు వేసిగెలిపించాలని కోరారు అలాగే కరీంనగర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేలిపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచులు అనిత రవీందర్ జాగృతి మండల అధ్యక్షుడు కందుకూరి రామా గౌడ్ ఏం సి మాజీ డైరెక్టర్ రోజా వెంగళ రమేష్ నందగిరి భాస్కర్ శివ విజయ్ నరేష్ బాలకృష్ణ ఉమాశంకర్ యాదగిరి రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *