రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్ ముఖ్య అతిధిగా హాజరై 1098 ఉచిత నెంబర్ ను ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించుకోవచ్చు, 1098 ద్వారా అందే సేవలు, సేఫ్ టచ్, ఆన్ సేఫ్ టచ్, చిన్న పిల్లలపై జరిగే ఆఘాయిత్యాల గురించి, స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన కలిపించారు. పిల్లలకు ఎలాంటి ఆపద ఉన్న 1098 ఉచిత నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మిరాజం, చైల్డ్ హెల్ప్ లైన్ టీం నరేంద్ర, సాయికిరణ్, మహేష్, చరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.