మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు.

State President State President.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు…

కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్.

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college
shine junior college

ఆపరేటర్లకు భారంగా మారుతున్న పోల్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ రావు డిమాండ్ చేశారు…

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని సింగరేణి ఫంక్షన్ హాల్ లో కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది…ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షులు వేశాల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదురుకుంటున్న సమస్యల పై చర్చించారు…ముక్యంగా ఆపరేటర్లు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆపరేటర్లు కోరారు..ప్రభుత్వాలకు,ప్రజలకు నిత్యం వారధి లా ఉండే కేబుల్ టీవీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందన్నారు…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేబుల్ ఆపరేటర్లకు కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదన్నారు…అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన.. ఆచరణ లోకి రాలేదని కేబుల్ ఆపరేటర్లు తెలిపారు..ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పట్టించుకోవాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం నాయకులు కోరారు..ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నుండి అంబేద్కర్, జయశంకర్ విగ్రహం మీదుగా జెన్కో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు…అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు కేబుల్ ఆపరేటర్లు వినతి పత్రం సమర్పించారు…పోల్ టాక్స్ ను రద్దు చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!