కొల్చారం,( మెదక్ ) నేటి ధాత్రి:-
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన గూడెం మైపాల్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం, సంగారెడ్డి జిల్లా స్వచ్ఛంద సేవ అధ్యక్షులు బివి శివశంకర్ రావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
* సంగారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన.. శివశంకర్ రావు ….
సంగారెడ్డి నుంచి నూతనంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన చింతల ప్రభాకర్ ను బివి శివశంకర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని సంగారెడ్డి జిల్లా స్వచ్ఛంద సేవ అధ్యక్షులు బివి శివశంకర్ రావు తెలిపారు.