కోనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంవిద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల శిథిలావస్థలో ఉండగా నూతన భవనం నిర్మించి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయమని వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి నరసింహ రావు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామంలో పూర్వ విద్యార్థులు నిర్మించిన పాఠశాలను క్షేత్రస్థాయిలో శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణానికి గాను చల్మెడ లక్ష రూపాయల విరాళం అందించారు. దీంతో పూర్వ విద్యార్థులంతా కలిసి కృతజ్ఞతా వేదికను ఏర్పాటు చేసి చలిమెడను శాలువాతో సన్మానించారు. ఇక్కడ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ,నవీన్ సింగం ప్రసాద్, దేవేందర్ రెడ్డి, రామదాసు, తదితరులు పాల్గొన్నారు.