మాల్యాల ఘటణ మరువక ముందే మరో హత్య మండలంలో సంచలనం రేకెస్తున్న హత్యలు..
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పులి గంగారాం(55) అనే వ్యక్తి అదే గ్రామంలోని ఓ హోటల్లో పని చేస్తాడు. ఉదయం రక్తం మడుగులో ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు..హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మాల్యాల ఘటన మరువక ముందే మళ్ళీ రెండో ఘటన మండలం లో హత్యలు సంచలనం రేపుతున్నాయి.