బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలల పురోగతికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు
మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా వాటిని ఎంఈఓ కార్యాలయం లో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వినతి పత్రంను ఎంఈఓ అందుబాటులో లేనందున కంప్యూటర్ ఆపరేటర్ మామి డి రజిత పలు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అంద జేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర పాఠశాలలో గోడలకు పెచ్చులు ఊడిపోయి శిధిలా వస్థకు చేరుకున్నాయి వాటిని పునర్మించాలని మరియు కంప్యూటర్ క్లాసులు చెప్పా లని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకోవ డానికి ఆటస్థలం ఏర్పాటు చేయాలి కోతుల సమస్యల నుండి విముక్తి కల్పించాలి కంప్యూటర్ క్లాస్ లను నేర్పిం చాలి మండల కేంద్రంలో రెండు ప్రభుత్వ బాల,బాలికల పాఠశాలలు ఎందుకని విద్యా ర్థుల సంఖ్య తక్కువ ఉన్నం దున ఒకే దగ్గర తరగతులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కూతాటి రమేష్ ,బిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు పురాణం చంద్రశేఖర్, బిఆర్ ఎస్వి జిల్లా నాయకులు అంబాటి అఖిల్ పాల్గొన్నారు