తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కార్యకర్త అంజయ్య గౌడ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రమాదవశాత్తు మరణించిన అంజయ్య గౌడ్ కుటుంబానికి ప్రమాద బీమా తరుపున 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇందుకు సహకరించిన మంత్రి కేటీఆర్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రాజన్న ఎంపీపీ పడిగల మానస రాజు ఏఎంసీ చైర్మన్ సరస్వతి సర్పంచ్ ఆనందరావు ఎంపీటీసీ రాము కోడి అంతయ్య సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులు గోపాల్ రావు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్మాని లింగారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు కనకరాజు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు