జైపూర్’నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బుధవారం రోజున ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ని ప్రజలందరూ ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.గత 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.బాల్క సుమన్ ఎమ్మెల్యే గా గెలిచాక తన నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లోనే ఒక మోడల్ గా తయారు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తిని ప్రజలందరూ గెలిపించుకోనీ అభివృద్ధి దేయంగా నడిపించుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నే హైట్రిక్ సాధిస్తది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుగుట రాజ్ కుమార్, కోట వెంకటేష్, గోదారి బాలకృష్ణ, దూట నారాయణ అలాగే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.