కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటిధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బాయ్ చెప్తున్నారు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం తాజాగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు,నర్వ గ్రామానికి చెందిన యువ నాయకులు పవన్ కుమార్ తో పాటు దుగుట జితేందర్,జాడి శ్రీనివాస్,దుగుట రాజకుమార్, జాడి రాజశేఖర్,బండారి శేంకర్,గోదారి గణేష్,సల్లూరి వెంకటేష్,గోదారి దుర్గయ్య లు పలువురుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరినట్లు పవన్ కుమార్ తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం తమ వంతు సహాయంగా కృషి చేస్తామని తెలిపారు, ఆ రోజులలో కాక వెంకటస్వామి చేసిన సేవలను ఎవరు మర్చిపోలేదని ప్రస్తుతం రాజకీయాల్లో వివేక్ వినోద్ ఒక రామ రాజ్యంల పరిపాలిస్తున్నారని వాళ్లు చేసిన సేవలను బట్టి ప్రజలు వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!