కండవు కప్పి ఆహ్వానించిన ఎంపీ సంజయ్
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొప్ప వెంకన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ శ్రేణులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కొరకు కృషి చేస్తానని తెలిపారు