రామడుగు, నేటిధాత్రి:
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది. అనంతరం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి రాజేందర్ రెడ్డి, పూడూరి మల్లేశం, వేల్పుల హరికృష్ణ, సుద్దాల మల్లేశం, రేణికుంట అశోక్, పురాణం రమేష్, సిరిపురం సురేష్, కత్తెరపాక మధు, లింగంపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.