
నాగర్ కర్నూల్ : నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సైదులు బిఆర్ఎస్వి నాయకులు సిద్ధగొని నరేష్ గౌడ్, రవి తదితరులు ఉన్నారు.