సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి
క్రైస్తవ సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని బి ఆర్ ఎస్ పరకాల పట్టణ కమిటి అధ్వర్యంలో పరకాల పట్టణంలోని క్రైస్తవ సోదరీ, సోదరులకు పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పార్టీ పట్టణ కమిటి పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచరు.అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు సి ఎస్ ఐ మిషన్ చర్చిలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పరకాల పట్టణ అద్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రతిఒక్కరికీ ఆనందం, శాంతి,శ్రేయస్సును అందించాలని, క్రిస్మస్ సామరస్యం,కరుణ స్ఫూర్తికి ప్రతీక,ప్రతి ఒక్కరూ సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆశాభావం వ్యక్తపరిచారు.అలాగే ప్రతిఒక్కరూ యేసుక్రీస్తు బోధనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్స్ మడికొండ సంపత్ కుమార్,శనిగరపు రజినీ నవీన్,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్,చర్చ్ సంఘం బాధ్యులు రెవరెండ్. జాన్ అయ్యగారు,కార్యదర్శి బొచ్చు జాన్సన్,బి ఆర్ ఎస్ నాయకులు బొచ్చు నాగరాజు, బొచ్చు సుగుణాకర్,బొచ్చు అనిల్,బొచ్చు జేపి,బొచ్చు సది, దుప్పటి బాబూరావు, మడికొండ ఎమ్మెస్ రవి, మడికొండ రాజు,బొచ్చు క్రాంతి, మడికొండ ప్రవీణ్, మడికొండ వైఎస్సార్,క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!