క్యాతనపల్లి లో బిఆర్ఎస్ సిపిఐ దోస్తానకు సై..
స్కాములే తప్ప స్కీములు లేని ప్రభుత్వం నడుస్తుంది..
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
సింగరేణి సంస్థ వ్యక్తుల చేతిలో బలి అవుతుంది…
ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్లు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య లు తెలిపారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బారాస పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక విఫలమయ్యిందని ఆరోపించారు. క్యాతన పల్లి మున్సిపాలిటీ లో సిపిఐ పార్టీతో కలిసి పోటీ చేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రాంతంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, సంస్థ వ్యక్తుల చేతిలో బలవతోందని సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య ఆరోపించారు.భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ తో పాటు కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పొత్తుల్లో భాగంగా ఏ ఏ స్థానాల్లో బరిలో గెలుస్తామో మూడవ తేదీన తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ , మేడిపల్లి సంపత్, బారాస, సిపిఐ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
