ముత్తారం మండలంలో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం..

సమస్యలపై ప్రజాగుంతకై మాట్లాడే వ్యక్తి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి..

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలంలో జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ముత్తారం టౌన్లో, ఓడేడు గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల గడపగడప ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించి ప్రచారం చేశారు పది సంవత్సరాలు పేదలకు అండగా ఉండి బిఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు సంక్షేమ పథకాలు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించిన కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మొండి చేయి చూపించరు కనుక పేదలకు అండగా మాట్లాడే వ్యక్తి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారంలో గ్రామ శాఖ అధ్యక్షులు అలువోజు రవీందర్ చారి,బేధ సంపత్,చల్ల రాజేందర్,చల్ల సమ్మయ్య,రాగుల రవీందర్, రాగుల రాజేశం, ఓడేడు ప్రచారంలో గ్రామ శాఖ అధ్యక్షులు నరేడ్ల రమేష్, మాజీ సర్పంచ్ ఇల్లందుల అశోక్ గౌడ్ నరేడ్ల రమేష్, దాసరి దామోదర్, సాయి, నరేడ్ల రాజయ్య నరేడ్ల రాజయ్య కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *