బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభించిన. కార్పొరేటర్, ఎమ్మెల్యే
మల్కాజిగిరి నేటిధాత్రి 02:
నేరేడ్మెట్ డివిజన్ లోని ఎంప్లాయీస్ కాలనీ నుంచి సాయికృష్ణ ఎన్క్లేవ్కి 2 ఏళ్ల క్రితం పెట్టిన బాక్స్ డ్రైన్ పనులకు అనుమతి రావడంతో, 6.2 కోట్లు ఎన్డీపీ కింద ఇవ్వాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన. స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
గతంలో ఎస్ఎన్డీపీ కింద 40 కోట్లతో యాప్రాల్లో పనులు పూర్తి చేసి యాప్రాల్కి వర్షాకాలంలో 20 సంవత్సరాల నుండి పెద్ద సమస్య పరిష్కరించడం జరిగింది

అలాగే ఈ పనులు కుడా పూర్తి అయిపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా వర్ష కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్థానిక కార్పొరేటర్ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, పరమేష్, శర్మ, సత్యనారాయణ, రాజి రెడ్డి, పర్వతాలు,శ్యామ్, అకారం సాయి, పవన్, నవీన్ గౌడ్, ఆల్బర్ట్, పంకజం, సుదర్శిని, షాలిని, ఎస్ఎన్డీపీ అధికారులు, కాలనీ సభ్యులు మరియు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.