
హమాలీ కాలనీ పెద్దమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాలు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలీ కాలనీ లో శనివారం బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెద్దమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు బోనాలు నిర్వహించడం జరుగుతుందని మహిళ లు సమయానికి బోనాల తీసుకొని రాగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదలు పొందగలరని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.