ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గా బోలి బాబు నియామకం.
చిట్యాల, నేటిధాత్రి :
ఎమ్మార్పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఇన్చార్జిగా బోలి బాబు మాదిగను నియమించడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ లు పోగు వెంకటేశ్వరరావు మాదిగ, రుద్రారపు రామచంద్ర మాదిగ, సుంచు రాజు మాదిగలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బోలి బాబు మాదిగ సొంత గ్రామము జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండల్ వాస్తవాడైన ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్ర మొగిలి మాదిగ, జిల్లా సీనియర్ మాదిగ, నోముల శ్రీనివాస్ మాదిగ, దోర్నాల రాజేందర్ మాదిగలకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ..

గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలను నేను పాటిస్తున్న రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలను వమ్ము చేయకుండా చిట్యాల మండలంలో మండలంలో అన్ని గ్రామాలు సందర్శించి..
గ్రామ కమిటీల పునర్మానం చేపట్టి..
గ్రామ గ్రామాన జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగను విజయవంతం జరిగేలా కృషి చేస్తానన్నారు.