
President Burra Venkatesh Goud.
గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు.
బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్
చిట్యాల, నేటిధాత్రి ;
గ్రామల అభివృద్ధియే బిజెపి లక్ష్యమని చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని పేద ప్రజల కోసం ముద్ర లోన్లు ఇంటింటికి ఎల్ఈడి బల్బులు సౌకర్యం సులభతరంగా ఉండాలని ఐదు వందే భారత్ రైలును యువత కు ఉద్యోగ కల్పన అదేవిధంగా మహిళలకు ఉజ్వల యోజన గ్యాస్ లు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మద్దతు తెలిపాలని అన్నారు
అదేవిధంగా అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ బూటక హామీలతోని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు నోచుకోలేని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అములు చేయలేదన్నారు,
కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు సీనియర్ నాయకులు చెక్క నరసయ్య, సుధ ల వెంకటరాజ వీరు, సుదగాని శ్రీనివాస్ ,నల్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, గొపగాని స్వామి, మారత అశోక్ ,అనుపమ మహేష్, గొప గాని రాజు, మాదారపు రాజు ,రాజేష్, చెన్నవేని సంపత్, కదం రాజు, కేంసారపు ప్రభాకర్, ఆ వంచ రాజు, తీగల వంశీ,, అశోక్ చారి, శివారెడ్డి, చింతల రాజేందర్ ,జూనువల వివేక్, తొట్ల మహేష్, జంజర్ల కుమార్, కల్వచర్ల కిషోర్, చెప్పాలా రాజు, తదితరులు పాల్గొన్నారు.