
KTR
కేటీఆర్ పై బిజెపి చేసిన అనుచిత వాక్యాలు సరికాదు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ భవన్ లో
Ktr పై జిల్లా బీజేపీ నాయకులు చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్…. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు కలసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అధికారం లో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ని నీలాదీయడం మానేసి ప్రతి పక్షం లో ఉన్న KTR ని విమర్శించడం వారి విజ్ఞత కే వదిలి వేస్తున్నాం. Ktr సిరిసిల్ల నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రతి గ్రామం లో మేము చూపిస్తాం మీ నాయకుడు మంత్రి హోదా లో ఉన్న బండి సంజయ్ ఏమి చేసారో కనీసo ప్రతి మండలం లో అయినా చూపెట్టే దమ్ము మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం.బండి సంజయ్ తనకు తాను పెద్ద నాయకుడు అనే భ్రమలో ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే వ్యక్తి బండి సంజయ్ కాదు రాష్ట్ర రాజకీయాలను మార్చేసే శక్తి కూడా కాదు అటువంటి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన కర్మ KTR లేదు అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఇంకెన్ని రోజులు దేవుడి పేరు చెప్పి ప్రజలను రెచ్చగొడతారు గల్లీ లో మాట్లాడడం కాదు ప్రజా సమస్యేలపై పార్లమెంట్ లో మాట్లాడాలని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పాస్ అని తప్పించుకొని పోకుండా పోరాటం చేయాలనీ బండి సంజయ్ కోరుతున్నాను. ktr సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి కి ఏంతగానో కృషి చేసారు మళ్ళీ అధికారం లో కి వచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లే దమ్ము ktr కి ఉంది బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రం లో కేంద్ర పరిది లో ఉన్న ఒక ఫ్లై ఓవర్ దాదాపు 8 సంవత్సరము లుగా పనులు పూర్తి గాక అసంపూర్తి గా ఉండి అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది అది కూడా పూర్తి చేయని అసమర్ధత కలిగిన Mp మనకు ఉండటం మన దౌర్భాగ్యం కేంద్ర పరిది లో ప్రజలకు అవసరంమైన ఎన్నో అభివృద్ధి పనులు ఉంటాయి వాటిని తీసుకు రాకుండ మీ కుటుంబం వచ్చి గుడి లో ప్రమాణం చేస్తే మా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తుంది ఇవ్వా ఒక కాబినెట్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు..అని ఈ సందర్బంగా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం లో జిల్లా నాయకులు మెట్ట రాజు,కత్తెర వరుణ్ కుమార్, BRSV పట్టణ అధ్యక్షులు షేక్ సికిందర్, వడ్లురి సాయి, సూర్య, జోయేల్, వడ్లురి వేణు, ఆరుట్ల శరన్ పాల్గొన్నారు.