
BJP mandal president Borlakunta Shankar.
భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ
జైపూర్,నేటి ధాత్రి:
భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల కార్యచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మండల అధ్యక్షుడు కాసెట్టి నాగేశ్వర్ రావ్ ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి,భీమారం మండల ఎన్నికల కన్వీనర్ మాడెం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్,కొమ్ము దుషాంత్,కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్,దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్,మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.