అన్నాడీఎంకేతో భాజపా పొత్తు

వైకుంఠపాళిలో అన్నామలైని పాము కాటేసిందా, నిచ్చెన వరించిందా?

తమిళ యాక్టర్‌ విజయ్‌ పార్టీ ఎవరి ఓట్లు చీల్చనున్నదో?

అన్నాడీఎంకే పొత్తు భాజపాకు అనుకూలించే అవకాశాలే ఎక్కువ

అన్నాడీఎంకేకూ భాజపా ఆసరా అవసరం

 అలయన్స్‌ వద్దన్న అన్నామలై, వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేస్తారా?

 ఛరిష్మా లేక ఇబ్బంది పడుతున్న పళనిస్వామి

 భాషావివాదాలు, డీలిమిటేషన్‌ను పట్టుకొని వేలాడుతున్న స్టాలిన్‌

 విజయ్‌ ఛరిష్మా ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు, భాజపా నాయకత్వ పగ్గాలు చేపట్టి, అట్టడుగునుంచి 18శాతం ఓట్లు సాధించే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణలో బండిసంజయ్‌ ఎట్లానో, తమిళనాడులో అన్నామలై పార్టీకి అంత ముఖ్యం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒంటరిగా పోటీచేస్తే ఓట్లశాతం ఒక పరిమితికి పెరగవచ్చు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏఐడీఎంకేది కూడా ఎదురీదుతోంది. దీనికి బీజేపీ ఆసరా అవసరం. బీజేపీకి అధికారంలోకి రావడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గత ఎన్నికల లెక్కలకు సంబంధించి కూడికలు తీసివేతల ప్రకారం అన్నాడీఎంకేతో పొ త్తు మాత్రమే అధికారాన్ని అందించగలదన్నది స్పష్టమైంది. అన్నామలైకి పొత్తు ఇష్టంలేదు. పళనిస్వామికి, అన్నామలై పొడ గిట్టలేదు. పార్టీ విశాలహితం రీత్యా పదవీకాలం పూర్తయిన అన్నామలై అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా తమిళ సినీస్టార్‌ విజయ్‌ ‘తమిళగ వెట్రి కజగం ట్రాన్సిల్‌’ పేరుతో పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మరి ఆయన ఏ ద్రవిడ పార్టీ ఓట్లకు గండికొట్టి కొంప ముంచుతాడో తెలియడంలేదు. ఎక్కుమంది మాత్రం ఆయన ఎంట్రీ డీఎంకేకు నష్టమన్న అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అన్నాడీఎంకేGబీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమవుతుంది. ఇదిలావుండగా తెలంగాణలో బండిసంజ య్‌ను తప్పించినప్పుడు ఎట్లా నిరసనలు వ్యక్తమయ్యాయో, ఇప్పుడు అన్నామలై తప్పుకోవడం వల్ల తమిళనాడులో కూడా పార్టీ అభిమానుల్లో కూడా నిరసన వ్యక్తమవుతోంది. పార్టీకి ఒక దశ దిశ ఏర్పరచిన నాయకుడిని తప్పించడం ఎంతమేర సమంజసమన్న వాదనలు వినపిస్తున్నాయి. ఈ రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని నిచ్చెన వరిస్తుందో, ఎవరిని పాము కాటేస్తుందో అంచనా వేయడం కష్టం. అధ్యక్షపదవికి రాజీనామా పాము కాటుగా మారుతుందా లేక నిచ్చెన పైకి లాక్కెళుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

పొత్తుకు ఇష్టపడని అన్నామలై

2023 మార్చి నుంచి అన్నామలై, ఎ.ఐ.డి.ఎం.కె.తో పొత్తు కుదుర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. ఆవిధంగా పొత్తు కుదుర్చుకోవడం రాష్ట్రంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను పళంగా పెట్టడ మే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 1G1R2 అన్న సూత్రం పనిచేయదు. ఒక్కో సారి 1G1R11 కూడా కావచ్చు! గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజ యానికి, ఎ.ఐ.డి.ఎం.కెGబిజేపీ అలయన్‌ లేకపోవడమే కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. కోయంబత్తూరులో గత లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, డీఎంకే అభ్యర్థికంటే ఎక్కువ. అంటే అలయన్స్‌లో ఉన్నట్లయితే ఇక్కడ అన్నామలై గెలిచివుండేవారని స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి మరో 12 నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. 12సీట్లలో బీజేపీ ఓట్లశాతం విషయంలో ఏఐడీఎంకేను వెనక్కు నెట్టేసిన సంగతి కూడా వాస్త వం. అన్నాడీఎంఏ చరిత్రలో 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం కూడా ఇదే ప్రథమం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ జరగబోతున్నది. మరి కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికలబరిలో దిగుతున్న సినీనటుడు విజయ్‌ ఈ రెండు ద్రవిడ పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనేది ప్రధాన ప్రశ్న. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పోటీ డీఎంకేకు లాభం చేకూరుస్తుంది. కానీ మరికొందరు మాత్రం విజయ్‌ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు. ఈ చీల్చడం 15శాతం వరకు ఉంటే డీఎంకే కుప్పకూలడం ఖాయమన్నది వారి అంచనా. ఇదిలావుండగా అన్నామలై గత ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను విమర్శల బాణాలతో చీల్చి చెండాడారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కూడా విమర్శించడం పళనిస్వామికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది కూడా. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢల్లీిలో ఆయన అమిత్‌షాను కలిసినప్పుడు, అన్నామలైను తప్పించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు మాత్రమే కాదు ఇద్దరిదీ గౌండర్‌ కులమే! తమిళనాడులో కుల రాజకీయాలు ఎంతటి స్థాయిలో వుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నియమావళి ప్రకారం మరోసారి అన్నామలైని రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చు. కానీ ఆయనకు అన్నాడీఎంకేతో పొత్తు అస్సలు ఇష్టంలేదు. కానీ పార్టీ అధిష్టానం ఆలోచనలు వేరే వు న్నాయి. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చే సానుకూల పరిస్థితులున్నాయి. తెలంగాణలో పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో భాగస్వామిగా వుంది. కేరళలో ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈసారి డీఎంకేను చావుదెబ్బ కొట్టవచ్చున న్నది ఎన్నికల లెక్కలు చెబుతున్న సత్యం. దీనికి తోడు అన్నాడీఎంకే నుంచి మరిని సీట్లు కోరవచ్చు కూడా. ఆవిధంగా అధికారంలో భాగస్వామి కావచ్చు. 

అన్నామలై భవితవ్యం?

ఇప్పుడు పార్టీ తమిళనాడు అధ్యక్షపదవికి 39 ఏళ్ల మాజీ ఐపీసీ ఆఫీసర్‌ అన్నామలై రాజీనామా తో బీజేపీ కేంద్ర వర్గాల్లో ఆయన భవితవ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అన్నామలై, ఇటు మోదీకి అటు అమిత్‌షాకు అత్యంత ఇష్టుడైన యువ నాయకుడు. ఈ నేపథ్యంలో మూడు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఆయనకు రాజ్యసభ సభ్యత్వం క ల్పించడం. రెండవది కేంద్రంలో ఏదో ఒక పదవి ఇవ్వడం. మూడవది పార్టీలో కీలకమైన పదవికట్టబెట్టడం. ఇందులో రాజ్యసభ సభ్యత్వం విషయానికి వస్తే, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ఎంపీ ల విమర్శనలను గట్టిగా ఎదుర్కొనే వాక్పటిమ, విషయపరిజ్ఞానం అన్నామలైకి పుష్కలం. ఈ కా రణంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశమున్నదన్నది మొదటి అంచనా. ఇక రెండవది కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం. ఆవిధంగా చేయడం అంత సమంజసమైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీని అట్టడుగు స్థాయినుంచి బీఆర్‌ఎస్‌ ఢీకొట్టే స్థాయికి తీ సుకొచ్చిన బండిసంజయ్‌ను ఆకస్మికంగా అధ్యక్ష పదవినుంచి తప్పించి కేంద్రంలో సహాయమం త్రి పదవిని ఇచ్చారు. దీంతో ఆయన పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కుంచించుకుపోయింది. ఆయన్ను తప్పించిన కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ సీట్లు ఆశించిన స్థాయిలో పెరగలేదన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈ కారణంగానే తెలంగాణలో బండి సంజయ్‌ను తొల గించినప్పుడు చాలా గొడవైంది.ఇప్పుడు అన్నామలై పరిస్థితి కూడా తమిళనాడులో సరిగ్గా ఇదే మాదిరిగా వుంది. అయితే తమిళనాడులో భాజపా ఎదుగుదలను ద్రవిడవాదం ఒక స్థాయికి మించి ఎదగనీయదనేది అక్షరసత్యం. రాష్ట్రంలో దాదాపు 70`80శాతం మంది ప్రజలు ద్రవిడ వాదానికే మద్దతిస్తారు. తమిళనాడులో 25శాతం ఓట్లు వచ్చినా భాజపాకు సీట్లు రావడం కష్టం. లోక్‌సభలో 18శాతం ఓట్లు వచ్చాయంటే అంటే మోదీ కోసం అనుకోవాలి. అసెంబ్లీకొచ్చేసరికి ఈ శాతం ఇంకా పడిపోతుంది. ద్రవిడ రాజకీయాలు నడిచినంతకాలం బీజేపీకి 25శాతం మించి ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు. అంటే అన్నామలై ఎంతగా శ్రమించినా ఈ శాతానికి మించి ఓట్లు సాదించడం కష్టం, పార్టీ అధికారంలోకి రావ డం మాట అట్లావుంచి, సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నట్లయితే అధికారంలోకి రావడం ఖాయం. స్టాలిన్‌ తన తండ్రి మాదిరిగా ఛరిష్మా నాయకుడు కాదు, ఆయన కుమారుడు ఉదయనిధి మారన్‌ అంతకంటే కాదు! వీరిద్దరూ ద్రవిడవాదాన్ని భుజానేసుకొని నెట్టుకొస్తున్నారు. డీఎంకే నుంచి పుట్టిన అన్నాడీఎంకే పరిస్థితి అంతకంటే మెరుగ్గా లేదు. జయలలిత మరణం తర్వాత పార్టీకి నేతృత్వం వహిస్తున్న పళనిస్వామికి పార్టీని అధికారంలోకి తెచ్చే ఛరిష్మా లేదు. దీనికి తోడు పన్నీర్‌సెల్వంతో గొడవలు. బీజేపీతో పొత్తు విరమించుకోవడం వల్ల గత ఎన్నికల్లో పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న నగ్నసత్యం కళ్ల ముందు కదలాడుతోంది. దీనికి తోడు జయలలిత చివరిదశలో నరేంద్రమోదీ అండగా నిలవడమే కాకుండా, అన్నాడీఎంకేకు మేలు చేయడానికే కృషిచేశారు. ముఖ్యంగా శశికళ కబంద హస్తాలనుంచి పార్టీని కాపాడే క్రమంలో పన్నీర్‌సెల్వంకు భాజపా అండగా నిలిచింది. చివరకు పళనిస్వామి కూడా భాజపా చేసిన మేలును మరచిపోలేదు. మొత్తంగా అన్నాడీఎంకేకు నరేంద్ర మోదీపట్ల కృతజ్ఞతాభావం వుంది. కాకపోతే అన్నామలై కొరకరాని కొయ్యగా వున్నాడు కనుక ఆయ న్ను తప్పించాలని పళనిస్వామి కోర్కె! ఇప్పుడాయన వాంఛ నెరవేరింది. అన్నామలైని తప్పించడానికి అంగీకరించిన భాజపా, పన్నీర్‌సెల్వంతో కలిసి పనిచేయాలన్న షరతు విధించినట్టు తెలు స్తోంది. 

ఇక మూడో అంశానికి వస్తే పార్టీలో కీలక పదవి ఇవ్వడం. అన్నామలైకి పార్టీని నడిపే సామ ర్థ్యం, అద్భుతమైన వాక్పటిమ, విషయ పరిజ్ఞానం వున్నాయి. కాకపోతే ఆయన రాజకీయ ప్రొఫైల్‌ కేవలం ఐదున్నరేళ్లు మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కొందరికి 30 ఏళ్లు, 40ఏళ్లు మరికొందరికి జీవితకాలం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అనుభవం కంటే, ఛరిష్మాతోపాటు, తన ఆకర్షణశక్తిని ఓట్లుగా మార్చే సామర్థ్యమున్న నాయకుడు పార్టీకి అవసరమవుతా రు. ప్రస్తుతం జాతీయస్థాయిలో బీజేపీ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో నడ్డా తప్పుకోవడంఖాయం. మరి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? నితిన్‌ గడ్కరీ అంగీకరించరు. రాజ్‌నాథ్‌సింగ్‌కు వయసైపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ఛరిష్మా మహారాష్ట్రకే పరిమితం. వీటితోపాటు ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే ఉత్తరభారత దేశంలో, ఓట్లు, సీట్లు సాధించే విషయంలో ఒక సంతృప్తస్థాయికి చేరుకుంది. అంటే అక్కడ తిరుగులేని స్థాయిలో స్థిరంగా వుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హేమంత్‌ బిశ్వాస్‌ శర్మ నాయకత్వంలో పూర్తిగా బలపడిరది. ఇప్పుడు పార్టీ బలపడాల్సింది దక్షిణ భారతదేశంలో. దక్షిణాదిలో భాజపాకు ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడిపోయింది. ఈ అపప్రధ తొలగించుకొని దక్షిణాదికి కూడా తాము ప్రాధాన్యమిస్తామన్న అంశాన్నిపార్టీ నిరూపించుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో కూడా ఈ రాష్ట్రాల్లో పార్టీ పెద్దగా బలపడలేదు. ఇప్పుడు అన్నామలై యువనేతగా, ఛరిష్మా కలిగినవాడిగా, ద్రవిడ రాజకీయాలను ఎదుర్కొనే సామర్థ్యం వున్న వాడిగా నిరూపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షపదవి ఇవ్వడం ద్వారా పార్టీ అధినాయకత్వం ఒక ప్రయోగం చేయవచ్చు! ఆవిధంగా చేయడం ద్వారా తమ పార్టీలో సామర్థ్యమున్నవారెవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునన్న బలమైన సంకేతాలను ఇవ్వవచ్చు. ఒక తమిళుడిగా, కేరళ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగలరు. ఇన్ని లక్షణాలున్నా, ఇన్నిసానుకూలతలున్నా, మోదీ`అమిత్‌ షా ద్వయం తమకు అత్యంత ఇష్టుడైన అన్నామలైకి ఇంతటి బృహత్తర బాధ్యత ఇచ్చే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. 

పొత్తు లెక్కలు

గత లోక్‌సభ ఎన్నికల్లో ఎ.ఐ.డి.ఎం.కె.కి తమిళనాడులో వచ్చిన ఓట్లు 23శాతం. భాజపాకు 18 శాతం. అదే డీఎంకేకు 46శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 23G18 శాతాలను కలిపితే 41శాతం అవుతుంది. ఒక ఐదారుశాతం ఓట్లు సంపాదించగలిగితే డీఎంకేను మట్టికరిపించవచ్చు. ఇది పొత్తుకు ప్రధాన కారణం. మరి అన్నామలై పార్టీని జీరో స్థాయినుంచి ఆ స్థాయికి పెంచారు. ఒక బేస్‌ ఏర్పాటుచేశారు. కానీ ఆయనకు కొన్ని పరిమితులున్నాయి. ఎంతగొప్పగా చదువుకు న్నా, తమిళనాడుకు వచ్చేసరికి ద్రవిడియన్‌ రాజకీయాల్లోకి మారిపోతారు. అంటే యాంటీ హిందీ, యాంటీ నార్త్‌, యాంటీ బిహార్‌ గురించి మాట్లాడుతుంటారు. అన్నామలై ఆవిధంగా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు. చాలా విస్తృతమైన ఆలోచనా పరిధి వున్నవాడు. ఇక్కడ తమిళుల్లో ఒక గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఇతర ప్రాంతాలకు చెందినవారిని కూడా రాష్ట్రనాయకత్వాన్ని చేపట్టడానికిఅవకాశం ఇస్తారు. ఉదాహరణకు ఎంజీఆర్‌ మళయాళీ, జయలలిత కర్నాటకకు చెందినవారు.డీఎంకే నుంచే ఏఐడీఎంకే పుట్టింది. రజనీకాంత్‌ది మహారాష్ట్ర. అదేవిధంగా స్టాలిన్‌ పూర్వీకులు నెల్లూరు ప్రాంతంవారు. వైగో పూర్వీకులు కూడా ఆంధ్రప్రాంతం వారే! అంటే తమిళనాడులో వేరే ప్రాంతం నాయకత్వాన్ని ఆమోదించే సంస్కృతి కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ద్రవిడ పార్టీన నాయకులంతటి స్థాయి హై ప్రొఫైల్‌ నాయకుడు అన్నామలై కాకపోయినా మంచి ప్రభావాన్ని మాత్రం సృష్టించగలిగారన్నది అక్షరసత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!