Gadkari Confident of BJP Win
అస్సాం, బెంగాల్లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా
త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.
అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
మైనారిటీలు, ఎస్ఐఆర్పై కేంద్రంలోని బీజీపీ వైఖరిపై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సమ్మళిత అభివృద్ధే బీజేపీ విధానమని అన్నారు. ప్రగతి, ఐక్యతకు కట్టుబడి పార్టీ పనిచేస్తోందని, మతపరమైన ఏ గ్రూపులకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఎస్ఐఆర్ వంటి అంశాల విషయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని తెలిపారు. ‘అటు అస్సాం, అటు బెంగాల్లో మేము గెలుస్తామనే గట్టి నమ్మకం నాకుంది. ఏదో ఒక మతాన్ని కాకుండా అందర్నీ కలుపుకుని వెళ్లడమే బీజేపీ విధానం. చొరబాటుదారులను మేము వ్యతిరేకిస్తామే కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు’ అని గడ్కరి వివరణ ఇచ్చారు.
పార్టీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అనేదే ప్రధాన అంశమని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి కట్టుబడి పార్టీ పనిచేస్తోందని గడ్కరి చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా పెట్టుబడులు పెడుతున్నామని, మరిన్ని ప్రాజెక్టులకు కూడా ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. అస్సాం సహా ఈశాన్య ప్రాంతాల్లో రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, రూ.1.5 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో రూ.1.5 నుంచి రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని, అదనంలో మరో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు, హైవేలు, లాజిస్టిక్ వంటి సదుపాయాలతో కెనెక్టివిటీ పెరిగి, ఆయా ప్రాంతాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు. ఈశాన్య ప్రాంతాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదే పరిష్కారమని అన్నారు.
చొరబాట్లపై..
అక్రమ చొరబాట్లకు తమ పార్టీ వ్యతిరేకమని, ఏ నిర్దిష్ట మతానికి కాదని గడ్కరి స్పష్టం చేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోకుంటే దేశం ఒక ధర్మశాలగా మారుతుందని గడ్కరి హెచ్చరించారు. పశ్చిమబెంగాల్లో రాజకీయ మార్పు కోరుతూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని చెప్పారు. ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియపై బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, జాతీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని అన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తాము రాజకీయాలు చేయమని, ఆయా అంశాలను (ఎస్ఐఆర్ వంటి అంశాలు) కేవలం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నామని చెప్పారు.
