
Mohammed Raj, established
42 శాతం బీసీ బిల్లును బిజెపి ఆమోదించి ముస్లింలకు న్యాయం చేయాలి.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో రాజకీయ ప్రాతినిధ్యం కొరకుకులగనన చేపట్టి 42%బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది ముఖ్యంగా ఇందులో ముస్లిం బీసీలకు స్థానం కల్పించడం జరిగినది ఈ బిల్లును రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు అమలు కాకుండా అడ్డుపడుతున్నారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ఇంకా దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలో బీసీ ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయివాస్తవంగా స్వాతంత్రానికి పూర్వం 1852లో అంటర్ కమిషన్ బ్రిటిష్ కాలంలోనేముస్లింలలో ఉన్న బీసీ లకు చట్టబద్ధత చేసింది ముఖ్యంగా ముస్లిం లో ఉన్న బీసీ ఎ బి సి గ్రూప్ లకు చెందిన కులాలైన ఫకీరు మెహతారు దూదేకుల ఖురేషి గారెడి చాకలి మంగలి అత్తరు సాహెబులు పాములు పట్టేవారు 14 కులాలకు చెందిన బీసీ ముస్లింలు దాదాపుగా 37 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయము సమాజంలో ఉన్న హిందూ సోదరులకు తెలుసు కావున 42% బిసి బిల్లుకు అడ్డుపడకూడదని మన తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నాయకులను ముస్లిం బీసీ ఏ బి సి గ్రూపులకు చెందిన కులస్తుల తరపున రాష్ట్ర బిజెపి పెద్దలను కోరుచున్నాము అని మహమ్మద్ రాజ్ మహమ్మద్ విలేకరుల సమావేశంలో తెలియపరిచారు.