
చిట్యాల, నేటిధాత్రి :
బిజెపి వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ కి మద్దతుగా బుధవారం రోజున జరిగే సభ కు చిట్యాల మండలం నుండి వందలాది బిజెపి కార్యకర్తలు సభకు తరలి వెళ్లడం జరిగింది. దానిలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ జెండా ఊపి వాహన శ్రేణనీ ప్రారంభించడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక వర్గాల ప్రజలు బిజెపి వైపు ఉన్నారని మరొకసారి మూడోసారి నరేంద్ర మోడీ ని గెలిపించాలని ప్రజలు వస్తున్నారని ఎందుకంటే ఆయన చేసినటువంటి దేశాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విరామం లేకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే విధంగా అదే లక్ష్యంతోని పని చేసినటువంటి నరేంద్ర మోడీగారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మద్దతు తెలిపి ఆరూరి రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో జిల్లా మండలం శక్తి కేంద్రా ఇన్చార్జిలు సీనియర్ కార్యకర్తలు గుండ సురేష్, పంచిక మహేష్ ,శ్రీకాంత్ సూర శ్రీకాంత్ బుర్రీ తిరుపతి, వెంకన్న, సంఘ రఘుపతి ప్రభాకర్ తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు.