మందోళ్లగూడెం,సింగరాయచెర్వు గ్రామలలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

యాదాద్రి భువనగిరి ,నేటి దాత్రి

చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం, సింగరాయచెర్వు గ్రామపంచాయతీ పరిధిలో గల బూత్ నెంబర్ 10,11 బూత్ అధ్యక్షులు సప్పిడి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ కేతపల్లి జనార్దన్ రెడ్డి, నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డిలు హాజరై మాట్లాడుతూ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో సభ్యత్వాన్ని తీసుకొని పార్టీకి అండగాఉండాలని కోరారు. “గ్రామ పంచాయతీల అభివృద్దే దేశం యొక్క లక్ష్యమని” తెలిపారు. అనంతరం బిజెపి చౌటుప్పల్ మండల అధ్యక్షులు చినుకని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలోనే సభ్యత్వ నమోదులో చౌటుప్పల్ మండలం అగ్రగామిగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ప్రజాసమస్యలు తీర్చడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం,జిల్లా కార్యదర్శి బత్తుల జంగయ్య, అధికార ప్రతినిధి కైరంకొండ అశోక్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి, ఉపాధ్యక్షులు డి. వేణు,అశోక్ గౌడ్,ఒబీసీ మోర్చా పి. శ్రీనివాస్,ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట కృష్ణ,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పబ్బతి శేఖర్,ఒబీసీ మోర్చా జిల్లా కోశాధికారి రాధారపు సత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మిర్యాల రవి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేవైఎం జిల్లా స్పోర్ట్స్ కన్వినర్ బాతరాజు వెంకటేష్.మండల కార్యదర్శి టీ. శ్రీనివాస్ నాయకులు ఎం వెంకటరెడ్డి, వై సత్తయ్య,ఎం బీరప్ప బీ మల్లేష్, కే వికాస్, జి రాజు అనిల్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!