కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్…పట్టణంలో బిజెపి పార్టీకి చెందినా BC సెల్ , SC సెల్ అధ్యక్షులు వీరమల్ల రాజయ్య(పాల రాజు) బంగారు ప్రసాద్ ,రెళ్లి కులస్తులు , పాడి రైతు సంఘం నాయకులు 300 మంది చెన్నూర్ శాసన సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంఎల్ఏ పార్టీ కండువాలు కప్పి సాధారoగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆరు గారంటీ పథకం లొ ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బారి మెజారిటీ తో గెలిపిచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు , tpcc ప్రధాన కార్యదర్శి పిన్నంటీ రఘునాథ్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య , జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్ , మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఎర్రo సాగర్ రెడ్డి ,మైనార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్ ,యూత్ పట్టణ అధ్యక్షులు మోకనపల్లి రామకృష్ణా , సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్ , నీలం శ్రీనివాస్ గౌడ్ , శ్యామ్ గౌడ్ , గోపతి భానేష్ , ఉప్పులపు సురేష్ ,పుల్లూరి కళ్యాణ్ , పలిగిరి కనకరాజు ,బత్తుల వేణు,గండి కుమార్, మహిళ నాయకురాలు దీపా , కమల , తదితరులు పాల్గొన్నారు*