ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో 105,106,107,108బూత్ లలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడప గడపకు స్టిక్కర్, నరేంద్ర మోదీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ది పనుల కరపత్రంలను పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గం ప్రభారీ రాజేష్, బీజేపీ జిల్లాకార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి వెల్ముల రమేష్, బూత్ కమిటి అధ్యక్షులు కంకణాల ఆనందం, వేముల గణేష్, జిట్టా రాజు, చింతల తిరుపతి, సామల చందు, గొండ మధు, గాండ్ల సాయి కుమార్, ఉప్పు రవీందర్, జిల్లెల్ల సురేష్, గాండ్ల లచ్చయ్య, అవుదరి శేఖర్, అవుదరి సంపత్, అంబటి వినోద్, అమిరిశెట్టి సురేష్, అమిరిశెట్టి తిరుపతి, సాగర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *