BJP Leaders Submit Petition to Help Rain-Hit Farmers
నష్టపోయిన రైతులను రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు
కరీంనగర్: నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామడుగు మండల కేంద్రంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈసందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ మోంథ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాల కారణంగా మండలంలోని రైతుల పంటలు నష్టపోయి, కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదలుపెట్టక అనేక రైతుల ధాన్యం తడిసిపోయి, వరదల్లో కొట్టుకోపోవడం, వరి, మొక్కజొన్న, పత్తి రైతులు కూడా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కారుపాకల అంజిబాబు,మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల అధ్యక్షులు దుర్శేట్టి రమేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, షేవెళ్ల అక్షయ్, మాదం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేమ్ కనుకరాజు, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
