
BJP Leaders Conduct Seva Paksha Workshop in Ramadugu
సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సేవా పక్షం మండల కన్వీనర్ పోచంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి జాడి బాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు పార్టీ తెలిపిన సేవ కార్యక్రమలు గాంధీ జయంతి వరకు నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. మండల కేంద్రంలో బ్లడ్ డోనేషన్ క్యాంప్, శక్తి కేంద్రం ఇంచార్జి పరిధిలో స్వచ్ భారత్ కార్యక్రమాలు, జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీన్ దయల్ జయంతి రోజున ప్రతి బూత్ లో ఐదు మొక్కలు నాటాలని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ప్రతి బూత్ లో నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కళ్లెం శివ, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శిలు గుంట అశోక్, కడారి స్వామి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సంటి జితేందర్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, షేవెళ్ల అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి గౌడ్, ఉత్తేం కనుకరాజు, బుర్ర శ్రీధర్, ఎగుర్ల ఎల్లయ్య, మడికంటి శేఖర్, మంద రాజశేఖర్, వెంకట్ రెడ్డి, పురంశెట్టి మల్లేశం, వడ్లూరి రాజేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.