రామడుగు, నేటిధాత్రి:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రెండోసారి బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బిజేపి నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కి మరోసారి అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ కుమార్ ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించి జాతీయ నాయకత్వనికి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మన్, మండల ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్, మారుకొండ అనిల్, మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్,పొన్నం మల్లయ్య, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, సింగసాని మల్లేశం, రాగం కనకయ్య,వేముల శ్రీనివాస్, మాదం ఎల్లయ్య, కడారి శ్రీనివాస్, మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.