పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.!

Agriculture Agriculture

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.

మహదేవపూర్ నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఎర్ర చెరువు వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారికి బిజెపి మండల అధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని పిఎసిఎస్ నిర్లక్ష్యం అడవికి సమీపంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం వలన అడవిలోని వర్షపు నీరు వడ్ల కల్లం లో వచ్చి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది అని, అలాగే కొనుగోలు కల్లం వద్ద ఉన్న నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని, ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతుల కన్నీటికి కారణమైన టి ఏ సి ఎస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోజ్, శ్రీధర్, రవి ,వంశీ, వెంకటేష్, పూర్ణచందర్,రాజు ,లుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!