కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల బాంధవుడు,మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత శుభాకాంక్షలు
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజికవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రం పస్తపుర్ లో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉద్యమకారులతో కుల సంఘాల నాయకులతో కలసి కేక్ కాట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరిచిపోలేనివి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుచుకొని మన దేశ రాష్ట్రాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరం అన్నదమ్ముల వలె నడుచుకొని మనకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిదీ కూడా అందరం కలిసికట్టుగా ఆలోచించి పని చేస్తే మనం విజయాన్ని చేకూర్చుకుంటాం బాబు జగ్జీవన్ రావ్ 1935లో దళితులకు సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు , ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు ఆయన జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో , కార్మిక మంత్రిగా భారతదేశపు మొదటి మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా కూడా పనిచేశారు , అక్కడ ఆయన సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా తదుపరి 30 సంవత్సరాలు వివిధ శాఖలతో మంత్రిగా పనిచేశారు .

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,హుగ్గేలి రాములు,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, మరియు అరుంధతి సంఘం సభ్యులు,వరాలు, రామచందర్,ముర్జల్ గారు,జైరాజ్, శాంసన్ గారు,చిన్న గారు,రాజు తతిధురులు పాల్గొన్నారు.