ఘనంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు జహీరాబాద్ పట్టణం రాంనగర్ కాలనీ చౌరస్తా వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు బండమీది శ్రీనివాస్, సురేష్, రాంచందర్, టి.శివన్న,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,లక్ష్మణ్, నాగరాజ్,శికారి శ్రీనివాస్, తుక్కన్న,చేన్ మల్లు,శంకర్, తదితరులు పాల్గొన్నారు,