సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
వల్లూరి బీరప్ప మృతి బాధాకరం అని సిపిఎం జిల్లా కార్యదర్శిముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.బుధవారం గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో వల్లూరి బీరప్ప(70) ఉదయం అనారోగ్యంతో మరణించారు . బీరప్పమృతదేహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ,బీరప్పగొర్రెల మేకల పెంపకదారుల సంఘంలో పనిచేశారని, సిపిఎం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేశారనివారు కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ఎల్లప్పుడుసిపిఎం పార్టీ అండగా ఉంటుందనివారు తెలిపారు. వారి అంతక్రియలు వారి స్వగ్రామంలో గురువారం జరుగుతాయని, సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తలు, సిపిఎం పార్టీ సానుభూతిపరులు, సిపిఎం పార్టీ శ్రేణులుసకాలంలో హాజరు కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోసిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శికట్ట నరసింహ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సలీం, బోల్గురి నరసింహ,పగిళ్ల శ్రీనివాస్, వచ్చిన బీరప్ప,అచ్చిన శ్రీనివాస్, వల్లూరి నరసింహ, వల్లూరి శ్రీశైలం, బొట్టు శివకుమార్, బండారి కృష్ణయ్యతదితరులు పాల్గొన్నారు.